News September 2, 2025
మారిటైమ్ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ

AP: విశాఖపట్నంలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మారీటైమ్ రంగంలోని బ్లర్గ్స్ ఏఐ, డాకర్ విజన్, ఓల్టియో మారిటైమ్, ఆటోమాక్సిస్, ఈజీ లేన్, ఎయిమ్ లొకేట్ తదితర స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. పలు కంపెనీల సీీఈవోలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
Similar News
News January 28, 2026
మేడారం జాతరలో బెల్లమే బంగారం.. ఎందుకంటే?

TG: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతరలో భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి ప్రసాదంగా భావిస్తారు. బంగారంతో సమానంగా చూస్తారు. అందుకే ‘నిలువెత్తు బంగారం’ అంటారు. కోరికలు తీరితే తమ బరువుకు సమానంగా తులాభారం వేసి సమర్పిస్తారు. గద్దెల వద్ద బెల్లం ముక్కలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకుంటారు.
News January 28, 2026
వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీలో ఉద్యోగాలు

<
News January 28, 2026
చివరి కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు

మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన అజిత్ పవార్కు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ నెరవేరలేదు. ‘సీఎం కావాలనుకుంటున్నాను’ అని ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. ఎన్నో రాజకీయ ఎత్తుగడలు వేసినా సీఎం కుర్చీ మాత్రం అజిత్ దాదాకు అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే మహారాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన నేతగా <<18980541>>రికార్డు<<>> సృష్టించారు.


