News September 2, 2025

గజ్వేల్ బస్తీ దవాఖానను సందర్శించిన కలెక్టర్

image

గజ్వేల్ కోట మైసమ్మ దేవాలయం దగ్గర ఉన్న బస్తీ దవాఖానకు కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. సీజనల్ వ్యాధుల గురించి ఎంతమంది రోగులు వస్తున్నారు, డెగ్యూ పరీక్షలు చేస్తున్నారా..? అని మెడికల్ ఆఫీసర్‌ను అడిగారు. జ్వరం తగ్గని ప్రతి ఒక్కరికి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News September 3, 2025

పెరిగిన డిస్కౌంట్.. మరింత చౌకగా రష్యన్ ఆయిల్

image

భారత్‌కు క్రూడ్ ఆయిల్ మరింత చౌకగా లభించనుంది. రష్యా డిస్కౌంట్స్ పెంచడమే ఇందుకు కారణం. బ్యారల్ ధరపై 3-4 డాలర్ల మేర ధర తగ్గనుంది. ప్రస్తుతం IND రోజుకు 5.4 మిలియన్ల బ్యారళ్ల ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. అందులో 36% రష్యా నుంచే కొంటోంది. ఓవైపు ట్రంప్ 50% టారిఫ్స్‌తో ఒత్తిడి తెస్తున్నా భారత్‌ వెనక్కి తగ్గకుండా రష్యా, చైనాకు మరింత దగ్గరవుతోంది. తాజాగా చైనాలో జరిగిన SCO సమ్మిట్‌తో అది స్పష్టమైంది.

News September 3, 2025

అంటువ్యాధులు ప్రబలకుండా చూడండి: డీఎంహెచ్ఓ

image

బషీరాబాద్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డీఎంహెచ్ఓ లలితాదేవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు ఆమె సూచించారు.

News September 3, 2025

ప్రకాశం జిల్లాలో 121 ఎరువుల దుకాణాల్లో తనిఖీ

image

ప్రకాశం జిల్లాలో 121 ఎరువుల దుకాణాలను పోలీసులు తనిఖీ చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం మంగళవారం సాయంత్రం ప్రకటించింది. మంగళవారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు యూరియా ఎరువుల విక్రయాలను నియంత్రించడమే లక్ష్యంగా బ్లాక్ మార్కెట్‌లో గల ఎరువులను గుర్తించేందుకు సైతం స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు.