News April 3, 2024
నెల్లూరు: 8వ తేదీ వరకు పింఛన్లు

గ్రామ, వార్డు సచివాలయాల్లో బుధవారం నుంచి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. 8వ తేదీ వరకు నగదు అందజేస్తారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3,19,961 మంది లబ్ధిదారులుండగా.. వీరికి 95.77 కోట్ల నగదు పంపిణీ చేస్తారు. అనారోగ్యంతో తిరగలేని వారి వద్దకు సచివాలయ ఉద్యోగులు వెళ్లి నగదు అందజేయనున్నారు. పెన్షన్ల పంపిణీకి ఒక్కో సచివాలయంలో 5 నుంచి 6 కౌంటర్లు ఏర్పాటు చేశారు.
Similar News
News October 2, 2025
3వ తేదీ నుంచి జిల్లాలో రీ సర్వే గ్రామాల జాబితా విడుదల

ఈనెల 3వ తేదీ నుంచి జిల్లాలో 34 గ్రామాలలో రీ సర్వే నిర్వహించినట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. భూములు కలిగిన అందరూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూముల హద్దులు రీ సర్వే టీంకు చూపించి రికార్డులలో తమ పేరు నమోదు చేసుకొని రీ సర్వే నిర్వహించు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
News October 1, 2025
నెల్లూరు: జోరందుకున్న మద్యం అమ్మకాలు

అక్టోబర్ 2 గాంధీ జయంతి.. దసరా రెండు ఒకే రోజు వచ్చాయి. దీంతో మద్యం అమ్మకాలకు బ్రేక్ పడింది. దసరా పండగ అంటే మందు బాబులకు విందే. కానీ ఈసారి అది కుదరడం లేదు. దీంతో మందుబాబులు, బెల్టు షాపులు వారు ముందురోజే మద్యాన్ని భారీగా డంపు చేస్తున్నారు. రేపు జిల్లా వ్యాప్తంగా ఉన్న 180 కి పైగా వైన్, 26కు పైగా బార్లు మూతపడనున్నాయి. మరోవైపు చికెన్ దుకాణాలు రాత్రి సమయం, వేకువజామునే అమ్మకాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
News October 1, 2025
ఉదయగిరి: డిప్యూటీ కలెక్టర్ దంపతులకు తప్పిన ప్రమాదం

ఉదయగిరి హైవే పెద్ద చెరువుకు పోయే దారి వద్ద గేదెను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ డిప్యూటీ కలెక్టర్( రేరా) నాదేళ్ల తిరుపతయ్య దంపతులకు ప్రమాదం తప్పింది. ఉదయగిరి (M) గడ్డంవారిపల్లికి చెందిన డిప్యూటీ కలెక్టర్ తన స్వగ్రామం నుంచి ఆత్మకూరులోని శుభకార్యానికి వెళుతుండగా అడ్డుగా వచ్చిన గేదెలను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.