News September 2, 2025

ఈ నెల 5న అరకులో పర్యటించనున్న పవన్

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 5న అరకులోని మాడగడ గిరిజన గ్రామంలో పర్యటిస్తారని జనసేన ప్రకటనలో తెలిపింది. ఆదివాసీ సంప్రదాయ ఉత్సవం ‘బలి పొరోబ్’లో పాల్గొంటారని పేర్కొంది. 12 రోజుల పాటు గ్రామంలో నిర్వహించే ఈ వేడుకలు గత నెల 25న ప్రారంభమయ్యాయి. గిరి పుత్రుల ఆహ్వానం మేరకు చివరి రోజున పవన్ హాజరవుతారని వెల్లడించింది. ఆంధ్ర సరిహద్దుల్లోని ఈ గ్రామంలో జరిగే ఉత్సవాల్లో ఒడిశా ఆదివాసీలూ పాల్గొంటారు.

Similar News

News September 3, 2025

హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు

image

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై నార్సింగి PSలో మరోసారి కేసు నమోదైంది. జూన్ 30న రాజ్ తరుణ్ అనుచరులతో కలిసి తన కుటుంబసభ్యులపై దాడి చేశారని మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం ఎత్తుకెళ్లడంతో పాటు కుక్కను చంపారని ఆరోపించారు. ఈ ఘటనలో తన తండ్రి గాయపడినట్లు తెలిపారు. ఇది సైబరాబాద్ సీపీ దృష్టికి వెళ్లగా ఆయన ఆదేశాలతో నార్సింగి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.

News September 3, 2025

యూరియా సమస్య ఎందుకొచ్చింది: జగన్

image

AP: రైతులకు యూరియా కూడా ఇవ్వలేని అధ్వాన స్థితిలో కూటమి పాలన ఉందని YCP చీఫ్ జగన్ ధ్వజమెత్తారు. ‘బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సీజన్‌లో సాగయ్యే పంటల విస్తీర్ణం, ఎంత మొత్తంలో ఎరువుల పంపిణీ చేయాలనేది ఏటా జరిగే కసరత్తే కదా. మరి యూరియా సమస్య ఎందుకొచ్చింది? మా పాలనలో ఈ సమస్య రాలేదు. ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు.

News September 3, 2025

ఎలాంటి TRS ఎలా అయిపోయింది..

image

ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పడిన TRS దాదాపు పదేళ్లు అధికారంతో వర్థిల్లింది. ఆ పార్టీ పేరు చెప్పగానే KCR, హరీశ్‌రావు, KTR, కవితే గుర్తొచ్చేవారు. అలాంటి పార్టీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. BRSగా రూపాంతరం చెందడం, 2023 ఎన్నికల్లో ఓటమి పార్టీ రూపురేఖల్ని మార్చింది. ఆపై పలువురు MLAలు BRSను వీడగా, ఇప్పుడు KCR కూతురే దూరమవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.