News September 2, 2025

రైతుల కోసం మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మంత్రి అచ్చెన్న

image

రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం వెల‌గ‌పూడి స‌చివాల‌యం నుంచి మీడియాతో రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులు, ఉల్లి ధ‌ర‌ల‌పై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవానికి విరుద్ధమన్నారు. రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నమని మంత్రి అచ్చెన్న తీవ్రంగా ఖండించారు. వైసీపీ పాలనలో రైతులు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడ్డారన్నారు.

Similar News

News September 3, 2025

నిమజ్జనాల్లో డీజేలకు అనుమతులు లేవు: SP

image

శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాల నిమర్జన వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు. నిమజ్జనానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలను వినియోగించేందుకు అనుమతులు లేవన్నారు.

News September 3, 2025

చింతపండుకి గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న గిరిజనులు

image

శ్రీకాకుళంలోని ఏజెన్సీ ప్రాంతాలలో చింతపండు సేకరించే గిరిజనులు ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజన కార్పొరేషన్ నుంచి గిట్టుబాటు ధర లభించక దళారీల దోపిడీకి గురవుతున్నారు. ఈ ఏడాది ఏజెన్సీలో మంచు ఎక్కువగా కురవటంతో చింతపండు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు గిట్టుబాటు ధర చెల్లించకపోవటంతో దళారీలకే చింతపండు తక్కువ ధరకు ఇచ్చేస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు.

News September 3, 2025

అరసవిల్లి సూర్య దేవాలయం మూసివేత

image

అరసవిల్లి ఆదిత్య ఆలయాన్ని ఈ నెల 7న భాద్రపద పౌర్ణమి చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తున్నామన్నారు. మరుసటి రోజు ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు.