News September 2, 2025

పెద్దపల్లి: ‘స్వచ్‌ ఏవం హరిత పాఠశాల వర్క్‌షాప్‌ నిర్వహణ’

image

పెద్దపల్లి జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలలో స్వచ్‌ ఏవం హరిత పాఠశాల వర్క్‌షాప్‌ నిర్వహించనన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు పూర్తిచేయాలని, నమోదు ఆధారంగా రేటింగ్ ఇచ్చి జాతీయ స్థాయి పురస్కారాలు ఇవ్వబడతాయని మంగళవారం డీఈవో మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ కవిత, అన్ని మండల MEOలు, DRPలు ప్రవీణ్‌, దేవేందర్‌, అన్ని మండల RPలు పాల్గొన్నారు.

Similar News

News September 3, 2025

కూటమి పాలనలో జగన్ ఫొటోతో సర్టిఫికెట్లు!

image

AP: గుంటూరు బ్రాడీపేటలో దివ్యాంగ సర్టిఫికెట్లపై జగన్ ఫొటోలు దర్శనమివ్వడం కలకలం రేపింది. ప్రభుత్వం మారి ఏడాదైనా సచివాలయం సిబ్బంది జగన్ ఫొటోలతోనే ధ్రువపత్రాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇది మీడియాలో వైరల్ కావడంతో పైఅధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే వాటిని వెనక్కి తీసుకొని లబ్ధిదారులకు కొత్త సర్టిఫికెట్లు జారీ చేశారు. సదరు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

News September 3, 2025

రూ.కోటి విరాళం ప్ర‌క‌టించిన మంత్రి టీజీ భ‌ర‌త్

image

అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు విగ్ర‌హ నిర్మాణానికి టీజీవీ సంస్థ‌ల త‌రఫున‌ రూ.కోటి విరాళం ఇస్తున్న‌ట్లు మంత్రి టీజీ భ‌ర‌త్ ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తిలో ఏపీ ప్ర‌భుత్వం, పొట్టి శ్రీరాములు మెమోరియ‌ల్ ట్ర‌స్ట్‌ సంయుక్తంగా 58 అడుగుల కాంస్య విగ్ర‌హంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం ఏర్పాటు చేయ‌నున్నాయి. వీటి నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన అనంత‌రం మంత్రి భ‌ర‌త్ ఈ విరాళం ప్ర‌క‌టించారు.

News September 3, 2025

చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం లేదు: CM రేవంత్

image

TG: BRS అనే పాములో కాలకూట విషం ఉందని CM రేవంత్ ధ్వజమెత్తారు. ‘రూ.లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. పంపకాల్లో తేడాలొచ్చి కొట్టుకుంటున్నారు. దోపిడీ సొమ్ము ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. వాళ్లలో వాళ్లు కొట్టుకుంటూ మాపై నిందలు వేస్తున్నారు. మంత్రగాడి దగ్గరికి వెళ్లి మీ పంచాయితీ తేల్చుకోండి. BRSను ప్రజలే బొందపెట్టారు. చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం మాకేముంది’ అని అన్నారు.