News September 3, 2025
అఫ్గానిస్థాన్కు భారత్ ఆపన్నహస్తం

భూకంపాలతో <<17592698>>అల్లాడుతున్న<<>> అఫ్గానిస్థాన్కు భారత్ ఆపన్నహస్తం అందించింది. బ్లాంకెట్స్, టెంట్స్, వాటర్ ప్యూరిఫయర్స్, జనరేటర్స్, కిచెన్ పరికరాలు, స్లీపింగ్ బ్యాగ్స్, మెడిసిన్స్, వీల్ఛైర్స్ తదితర అత్యవసర సామగ్రిని పంపింది. మొత్తం 21టన్నుల రిలీఫ్ మెటీరియల్ను విమానంలో కాబూల్కు చేర్చినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సాయం కొనసాగిస్తామని తెలిపారు.
Similar News
News September 4, 2025
GST తగ్గింపు.. సామాన్యులు ఖుషీ!

8 ఏళ్ల తర్వాత GST తగ్గడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాలు, వ్యవసాయ సామగ్రి, నోట్ బుక్స్, పెన్స్, ఏసీలు, టీవీలు, బైకులు, కార్లు.. ఇలా రోజువారీ జీవితంలో ఉపయోగపడే చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త పన్ను రేట్లు అమల్లోకి వస్తాయి. అప్పటివరకు ఆగి ఆ తర్వాత కొనేందుకు సామాన్యులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. GST తగ్గింపుపై మీ కామెంట్?
News September 4, 2025
ధోనీ అభిమానులకు క్రేజీ న్యూస్!

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మరో ఏడాది ఐపీఎల్ ఆడొచ్చని క్రీడావర్గాలు వెల్లడించాయి. N శ్రీనివాసన్ తిరిగి CSK ఫ్రాంచైజీ పగ్గాలు తీసుకున్నారని, ధోనీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపాయి. మరో సీజన్ కూడా ఆడాలని శ్రీనివాసన్ ధోనీని ఒప్పించే అవకాశం ఉందన్నాయి. కాగా 44 ఏళ్ల ధోనీ గత సీజన్లో అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడారు. ధోనీ వచ్చే సీజన్ ఆడటం అతడి ఫిట్నెస్పై ఆధారపడి ఉంది.
News September 4, 2025
కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. PPP మోడల్లో కొత్తగా 10 మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సవరణలకు ఆమోదం తెలపనుంది. వివిధ సంస్థలకు భూకేటాయింపులు, యూనివర్సల్ హెల్త్ పాలసీ తయారీ, అమలుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.