News September 3, 2025

సెప్టెంబర్ 3: చరిత్రలో ఈ రోజు

image

1893: సంస్కృతాంధ్ర రచయిత్రి కాంచనపల్లి కనకమ్మ జననం
1905: తెలుగు సినీ పాటల రచయిత, కవి కొసరాజు జననం
1908: నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన జమలాపురం కేశవరావు జననం
1952: బాలీవుడ్ నటుడు శక్తికపూర్ జననం(ఫొటోలో)
1978: సినీ నటుడు అర్జన్ బజ్వా జననం(ఫొటోలో)
1987: తెలుగు సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు మరణం
2011: పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మరణం

Similar News

News September 4, 2025

ధోనీ అభిమానులకు క్రేజీ న్యూస్!

image

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మరో ఏడాది ఐపీఎల్ ఆడొచ్చని క్రీడావర్గాలు వెల్లడించాయి. N శ్రీనివాసన్ తిరిగి CSK ఫ్రాంచైజీ పగ్గాలు తీసుకున్నారని, ధోనీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపాయి. మరో సీజన్ కూడా ఆడాలని శ్రీనివాసన్ ధోనీని ఒప్పించే అవకాశం ఉందన్నాయి. కాగా 44 ఏళ్ల ధోనీ గత సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడారు. ధోనీ వచ్చే సీజన్ ఆడటం అతడి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంది.

News September 4, 2025

కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. PPP మోడల్‌లో కొత్తగా 10 మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సవరణలకు ఆమోదం తెలపనుంది. వివిధ సంస్థలకు భూకేటాయింపులు, యూనివర్సల్ హెల్త్ పాలసీ తయారీ, అమలుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

News September 4, 2025

GST 2.0: పెరగనున్న IPL టికెట్ రేట్లు

image

కేంద్రం తీసుకొస్తున్న GST 2.0తో IPL అభిమానులకు షాక్ తగలనుంది. ఇప్పటివరకు 28% జీఎస్టీ శ్లాబులో ఉన్న ఐపీఎల్ టికెట్లపై ఇకపై 40% పన్ను పడనుంది. అంటే రూ.వెయ్యి టికెట్‌ ఇప్పుడు రూ.1280 ధరుంటే.. ఈ నెల 22 తర్వాత అది రూ.1400కు చేరుతుంది. అయితే, టీమ్ ఇండియా ఆడే అంతర్జాతీయ మ్యాచులకు మాత్రం టికెట్ ధరపై 18% జీఎస్టీనే కంటిన్యూ అవుతుంది. దానిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.