News September 3, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ICET-2025 రెండో విడత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం. ఖాళీగా 33 వేల సీట్లు.
* ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన PG ECET తొలి విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల గడువు ఈనెల 8 వరకు పొడిగింపు. వివరాలకు cets.apsche.ap.gov.in సైట్ను సంప్రదించండి.
* గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.
Similar News
News September 21, 2025
ఎల్లో అలర్ట్.. భారీ వర్షాలు

TGలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఉమ్మడి ఆదిలాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో ద్రోణి ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది.
News September 21, 2025
2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనే: రాజ్నాథ్

ప్రధాని పదవికి బీజేపీలో ఎలాంటి పోటీ లేదని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. 2029తో పాటు 2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనేనని ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమవ్వడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం, సంక్షోభంలోనూ నిర్ణయాత్మకంగా వ్యవహరించడం మోదీకే చెల్లిందని కొనియాడారు. పహల్గాం ఘటనకు స్పందించిన తీరే దీనికి నిదర్శనమని రాజ్నాథ్ అన్నారు.
News September 21, 2025
H1B వీసాలపై ఆంక్షలు.. ట్విస్ట్ ఏంటంటే?

కొత్తగా H1B వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే <<17767574>>ఫీజు<<>> పెంపు వర్తిస్తుందని వైట్ హౌజ్ అధికారులు చెప్పారని NDTV పేర్కొంది. ప్రస్తుతం ఉన్నవారికి లేదా రెన్యూవల్ చేసుకునే వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని వెల్లడించారని తెలిపింది. కాగా మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు H1B, H-4 వీసాలు ఉన్న తమ ఉద్యోగులను 14 రోజుల పాటు దేశం విడిచి వెళ్లవద్దని, ఇప్పటికే బయట ఉంటే వెంటనే వెనక్కి రావాలని ఆదేశించాయి.