News September 3, 2025

కూసుమంచి : జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి

image

కూసుమంచి మండలం కేశవాపురం గ్రామపంచాయతీ పరిధి చింతలతండా గ్రామానికి చెందిన దారావత్ నాగేశ్వరావు కుమారుడు వార్షిక్ తేజ (6) జ్వరంతో మృతి చెందాడు. గత వారం రోజుల నుంచి జ్వరం రావడంతో ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తేజ కూసుమంచిలో యూకేజీ చదువుతున్నాడు. తేజ మృతితో తండాలో విషాదం అలుముకుంది

Similar News

News September 8, 2025

స్థానిక ఎన్నికల జాబితాపై అఖిలపక్ష సమావేశం

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితాపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 8, 2025

ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

image

ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, బాధితులకు న్యాయం చేయాలన్నారు.

News September 8, 2025

ఖమ్మం: గణేశ్‌ ఉత్సవాలపై సీపీ ప్రశంసపీ

image

గణేశ్‌ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి అహర్నిశలు శ్రమించిన పోలీసు, హోంగార్డు సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ అభినందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వినాయక నవరాత్రుల నుంచి నిమజ్జనం వరకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉత్సవాలు జరగడానికి సహకరించిన భక్తులకు, వివిధ శాఖల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.