News September 3, 2025
ADB: PWD మంత్రి రాకేశ్ సింగ్ను కలిసిన MP నగేశ్

మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రజా పన్నుల శాఖ(PWD) మంత్రి రాకేశ్ సింగ్ను MP నగేశ్ భోపాల్ నగరంలో మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాజకీయాలు, తాజా అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ నగేశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు, అధికారులు తదితరులున్నారు.
Similar News
News September 7, 2025
వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్గా శ్రీదేవి

రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్గా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలానికి చెందిన శ్రీదేవిని కూటమి ప్రభుత్వం నియమించింది. మండల పరిధిలోని కొడికొండ చెక్ పోస్టుకు చెందిన శ్రీదేవి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
News September 7, 2025
నేడే చంద్ర గ్రహణం.. ఈ పనులు మానుకోండి

నేడు రాత్రి 9.58కి చంద్ర గ్రహణం మొదలుకానుంది. కానీ <<17628465>>సూతక కాల<<>> ప్రభావం మధ్యాహ్నం 12.57 నుంచే ఉంటుందని పండితులు చెబుతున్నారు. ‘ఈ సమయంలో ఆహారం తీసుకోవద్దు. వండుకోవద్దు. ముందే వండిపెట్టిన ఆహారంపై దర్భ గడ్డి/తులసి ఆకులు వేసి ఉంచాలి. లేదంటే కలుషితం అవుతుంది. గ్రహణ సమయంలో శుభకార్యాలు, పూజలు వద్దు. SEP 8, 1.26AMకి గ్రహణం ముగుస్తుంది. ఆ తర్వాత దానాలు చేస్తే విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి’ అని సూచిస్తున్నారు.
News September 7, 2025
US, చైనాలో ఇండియా దేనికి క్లోజ్? నిర్మల ఏమన్నారంటే?

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల భద్రత, శ్రేయస్సుకే ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచ దేశాలతో భారత సంబంధాలపై ఆమె మాట్లాడారు. US, చైనాలో IND దేనికి క్లోజ్ అని ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ ‘IND అంతటా స్నేహితుల్ని కోరుకుంటుంది. Quad, BRICS, RIC మూడింట్లో ఉంటుంది. కానీ నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. GST స్లాబ్స్ మార్పునకు US టారిఫ్స్ కారణం కాదన్నారు.