News September 3, 2025
HYD: మరో పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు

HYDలో మరో పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు కానుంది. MGBS మెట్రో స్టేషన్లో ఈ నెల 15, 16న దీనిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నగరంలో 3 PSKలు ఉండగా పాత బస్తీతో పాటు తూర్పుభాగంలో ఉండే ప్రజలకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడనుంది. MGBS మెట్రో స్టేషన్ మొదటి అంతస్తులో ఈ కార్యాలయం అందుబాటులోకి రానుంది. దీనిని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, సహాయక మంత్రి గానీ ప్రారంభించనున్నారు.
# SHARE IT
Similar News
News September 4, 2025
HYD: ఏపీపీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పోలీస్ నియామక బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. దాదాపు 118 పోస్టులకు దరఖాస్తులను ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఫీజు రూ.2000, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.1000. ఆసక్తిగల వారు ఈనెల 12 నుంచి అక్టోబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు www.tgprg.in వెబ్ సైట్ చూడవచ్చు.
News September 4, 2025
నాంపల్లి: డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సులకు 15 వరకు ఛాన్స్

డిగ్రీ, పీజీ డిప్లొమా, మాస్టర్ కోర్సులకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 15 వరకు ఉందని ఇగ్నో సీనియర్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. నాంపల్లిలో ఇగ్నో స్టడీ సెంటర్ ఉందని, చదువుకోవాలని ఆసక్తి ఉన్న వారు ఈ కోర్సులకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలను 040-23117550, 9492451812 నంబర్లకు ఫోన్ చేసి తెలసుకోవచ్చన్నారు.
News September 4, 2025
HYD: ఐకమత్యం.. ఫ్రెండ్స్కు లడ్డూ సొంతం

వినాయక నవరాత్రుల్లో పూజలు అందుకున్న లడ్డూ రూ.కోటి పలికింది అని వినగానే ఆశ్చర్యపోతాం. గొప్పింటి వారికి వేలంలో నెగ్గడం ఈజీ. కానీ మిడిల్ క్లాస్లో ఐకమత్యం ఉంటే చాలని ఈ మిత్రులు నిరూపించారు. రాంనగర్ EFYA ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంలో ఫ్రెండ్స్ లోకేష్, యోగేశ్వర్, కార్తీక్, డికాప్రియో కలిసి రూ.55 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. ఒక్కరితో కాదు.. నలుగురం కలిస్తే లడ్డూ దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.