News September 3, 2025
HYD: SEP 17న TG విమోచన దినోత్సవం: BJP

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లుగా బీజేపీ TG చీఫ్ రాంచందర్రావు తెలిపారు. వారం రోజుల ముందుగానే పరేడ్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయన్నారు. గతంలో కంటే ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
Similar News
News September 7, 2025
అప్పుల బాధ తాళలేక ఇద్దరు సూసైడ్

అప్పుల బాధ తాళలేక ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వెల్దుర్తి(M) పేరేములకు చెందిన మద్దిలేటి(50) కూతురి పెళ్లితో పాటు వ్యవసాయానికి అప్పులు చేశారు. వాటిని తీర్చేమార్గం లేక పురుగు మందు తాగి కోలుకున్నాడు. ఈ ఏడాదీ అప్పులు పెరగడంతో ఉరేసుకున్నాడు. మంత్రాలయం(M) మాలపల్లికి చెందిన ఉపేంద్ర(21)కు ఇటీవలే పెళ్లైంది. అప్పులు ఎక్కువ కావడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
News September 7, 2025
సముద్రం పాలవుతున్న కృష్ణా-గోదావరి వరద

గోదావరి, కృష్ణా బేసిన్లలో భారీ రిజర్వాయర్లు లేక వరద జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి నిన్నటివరకు గోదావరి నుంచి 2,350, కృష్ణా నుంచి 726 TMCలు సముద్రంలో కలిశాయి. కృష్ణా బేసిన్లో నాగార్జునసాగర్ 312.04 TMC, శ్రీశైలం 215.80, గోదావరి బేసిన్లో MH పైఠన్లో జయక్వాడీ 102, TGలో శ్రీరామ్సాగరే(80TMC) పెద్ద రిజర్వాయర్లు. పోలవరం(194 TMC) నిర్మాణం పూర్తైతే అదే అతిపెద్ద జలాశయం అవుతుంది.
News September 7, 2025
భద్రాచలం MLA పిటిషన్.. రాష్ట్ర వ్యాప్తంగా వివాదం

ST జాబితా నుంచి లంబాడీలను తొలగించాలంటూ ఆదివాసీలు, తాము అదే జాబితాలో ఉండాలని లంబాడీల మధ్య వివాదం తీవ్రమైంది. భద్రాచలం MLA తెల్లం వెంకటరావు, మాజీ MP సోయం బాపురావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని ఆదివాసీలు ఆరోపిస్తుండగా, తాము ఆర్థికంగా వెనుకబడే ఉన్నామని లంబాడీలు అంటున్నారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు త్వరలో తుదితీర్పు ఇవ్వనుంది.