News April 3, 2024

గుప్తనిధుల కొసం రాతి గోపురం ధ్వంసం

image

దేవాలయం రాతి గోపురంలో వజ్రాలు ఉంటాయని దానిని ధ్వంసం చేసిన ఘటన అనుముల మండలంలోని చోటుచేసుకుంది. పేరూరులో సోమేశ్వరస్వామి దేవాలయం కాకతీయుల కాలంలో నిర్మించారు. గతేడాది రూ.40 లక్షల నిధులతో దేవాలయం పునర్నిర్మాణం చేపట్టారు. గోపురం తొలగించి దేవాలయ ఆవరణలో పెట్టారు. దుండగులు ఆ రాతి గోపురాన్ని వాగులోకి తీసుకెళ్లి పగలగొట్టారు. అటుగా వెళ్లిన గ్రామస్థులు గమనించి దేవాలయం కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు.

Similar News

News April 3, 2026

నల్గొండ: నకిలీ విత్తనాలపై ‘స్పెషల్ ఆపరేషన్’

image

వానాకాలం సాగు వేళ నకిలీ పత్తి విత్తనాల విక్రయదారుల ఆట కట్టించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 5.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేయగా, ఇందుకోసం సుమారు17 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు గుర్తించారు. విడి విత్తనాల అక్రమ రవాణాను అరికట్టేందుకు త్రిముఖ వ్యూహంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వ్యాపారుల కదలికలపై నిరంతర నిఘా ఉంచనున్నారు.

News April 3, 2026

NLG: 20 వరకు పాలిటెక్నిక్ ఫీజు గడువు

image

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫీజు ఈనెల 20వ తేదీలోపు చెల్లించాలని NLG ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ CH.నర్సింహారావు తెలిపారు. టెన్త్ లేదా సమాన పరీక్ష ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి మే 13న పాలీసెట్-2026 నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. టెన్త్ హాల్టికెట్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉన్న వారు polycet.sbtet.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 2, 2026

NLG: 15 దిగ్గజ కంపెనీలతో మెగా జాబ్‌మేళా

image

MGU, టాస్క్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాలో 15 కంపెనీలు పాల్గొననున్నట్లు ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ హరీష్ కుమార్ తెలిపారు. ఐటీ, ఫార్మా, అగ్రికల్చర్, బ్యాంకింగ్ రంగాలలో సుమారు 1500 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లమో, ఇంజనీరింగ్ బీఎస్సీ అగ్రికల్చర్, B.Com,బీఫార్మ, MBA, MCA, M.Sc, డిగ్రీ చివరి సంవత్సరం అభ్యర్థులు హాజరు కావాలన్నారు.