News September 3, 2025

కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదు: మంత్రి తుమ్మల

image

కేంద్రానికి ముందు చూపు లేకపోవడంతోనే దేశంలో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘చైనా నుంచి రావాల్సిన యూరియా రాకపోవడం, దేశీయంగా ఉత్పత్తి పెంచకపోవడం వల్ల కొరత వచ్చింది. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్‌కి ఆస్కారం లేదు. రామగుండంలో 4 నెలలుగా ఉత్పత్తి నిలిచిపోయింది’ అని వివరించారు. ఇటీవల వర్షాలు, వరదల వల్ల 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, సాయం చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు.

Similar News

News January 31, 2026

T20WCకు ప్యాట్ కమిన్స్ దూరం

image

గాయం కారణంగా AUS స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ T20WCకు దూరమయ్యారు. గతంలో ప్రకటించిన జట్టులో 2 మార్పులు చేశారు. AUS సెలక్టర్లు కమిన్స్, మాథ్యూ షార్ట్‌ స్థానంలో పేసర్ బెన్ ద్వార్షుయిస్, మాట్ రెన్‌షాలకు అవకాశం కల్పించారు.
AUS జట్టు: మార్ష్(C), బార్ట్‌లెట్, కూపర్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, గ్రీన్, ఎల్లిస్, హేజిల్‌వుడ్, హెడ్, కుహ్నెమన్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, జంపా, రెన్‌షా, ఇంగ్లిస్.

News January 31, 2026

విటమిన్ D ఉండే ఆహారాలు

image

మన ఇమ్యూనిటీ పెంచేందుకు విటమిన్ D చాలా అవసరం. విటమిన్ డి స్థాయి తక్కువగా ఉన్నవారికి శరీర పెరుగుదల ఆగిపోతుంది. చలికాలంలో ఎక్కువ ఎండ అందుబాటులో లేని ప్రదేశాల్లో విటమిన్‌ డి లభించదు అలాంటప్పుడు కొన్ని విటమిన్‌ డి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవి సాల్మన్, రెడ్ మీట్, గుడ్డు సొన, లివర్‌లో ఎక్కువగా విటమిన్‌ డి ఉంటుంది. ఇలా కాకుండా సప్లిమెంట్లు వాడాలనుకుంటే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.

News January 31, 2026

కల్తీ నెయ్యి వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా YCP పూజలు

image

AP: కల్తీ నెయ్యి వివాదంలో దుష్ప్రచారం చేస్తున్నారని, భక్తుల మనోభావాలతో ఆడుకున్న CBN, పవన్‌కు భగవంతుడే బుద్ధి చెప్తారని YCP నేతలు చెప్పారు. వారి వ్యాఖ్యలను నిరసిస్తూ పాప పరిహార పూజలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ వంగా గీత, తూ.గో జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరి, YSR జిల్లా బద్వేలులో MLA దాసరి సుధ, NTR జిల్లా YCP అధ్యక్షుడు దేవినేని ప్రత్యేక పూజలు చేశారు.