News September 3, 2025
INSPIRING: 37 ఏళ్లపాటు నిస్వార్థ సేవ❤️

దేశ సేవ కోసం జీవితాన్నే త్యాగం చేసిన ఎంతో మంది మహానుభావులు మనకు స్ఫూర్తినిస్తుంటారు. వారిలో బ్రిగేడియర్ గిడుగు హిమశ్రీ ఒకరు. 1988లో ఇండియన్ ఆర్మీలో చేరిన ఆమె 37ఏళ్లపాటు వివిధ ర్యాంకుల్లో సేవలందించారు. అరుణాచల్ అడవుల నుంచి సియాచిన్ మంచు శిఖరాల వరకు అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ మెడికల్ యూనిట్లకు నాయకత్వం వహించారు. సోమాలియా వంటి సంఘర్షణ ప్రాంతాలలోనూ ఆమె అచంచలమైన ధైర్యాన్ని, దేశభక్తిని ప్రదర్శించారు.
Similar News
News February 18, 2026
ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

న్యూఢిల్లీలోని <
News February 18, 2026
ఫాల్గుణ మాసంలో ఇలా చేయండి: పండితులు

మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణం. ఈ నెలలో లక్ష్మీనారాయణులను భక్తితో కొలిస్తే శుభాలు కలుగుతాయని పండితుల మాట. ‘చంద్రుడు ఫల్గుణి నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరొచ్చింది. అర్జునుడికి ‘ఫల్గుణుడు’ అనే పేరుండటం మరో ప్రత్యేకత. దానధర్మాలు చేయడం, పవిత్ర నదులలో స్నానమాచరించడం వల్ల పుణ్యం లభిస్తుంది. ప్రకృతి వసంతానికి సిద్ధమయ్యే ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతనతో గడపడం ఉత్తమం’ అంటున్నారు.
News February 18, 2026
మిరప మొక్కల వేర్లపై బొడిపెలకు కారణమేంటి?

మిరప పంటకు నులి పురుగులు ఆశించడం వల్ల మొక్కల వేర్లపై బొడిపెలు ఏర్పడతాయి. దీని వల్ల పంటకు నష్టం వాటిల్లుతుంది. ఈ నులి పురుగుల నివారణకు ఎకరాకు 100 కిలోల వేప పిండిని చల్లి, మట్టిలో కలిసే విధంగా నీరు పెట్టాలి. ఈ పురుగులు ఆశించిన పొలంలో వంగ, టమాటా, బంగాళాదుంపలను సాగు చేయకూడదు. ఆవాలు, నువ్వులు, మొక్కజొన్న, చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


