News September 3, 2025
కవిత రాజీనామాతో రాష్ట్ర ప్రజలకు ఏమీ రాదు: బండి సంజయ్

TG: ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్, BRS నాయకులు కుమ్మక్కై కవిత ఎపిసోడ్ తెరపైకి తెచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికి 2 పార్టీలు డ్రామా ఆడుతున్నాయి. కవిత రాజీనామాతో రాష్ట్ర ప్రజలకు ఏమీ రాదు. కాళేశ్వరం అవినీతి గురించి మొదటి నుంచీ చెబుతున్నాం. ఇప్పుడు దాన్నే కవిత ప్రస్తావిస్తున్నారు. ఆమె వద్ద ఆధారాలు ఉంటే CBIకి ఇవ్వాలి’ అని అన్నారు.
Similar News
News September 19, 2025
ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే దాదాపు 13 బిల్లులకు ఆమోదం తెలిపింది. వాహనమిత్ర కింద ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు అందించే పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని పరిధిలో 343 ఎకరాల భూసేకరణకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అటు నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లును ఆమోదించింది.
News September 19, 2025
వాహనదారులకు గుడ్ న్యూస్.. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు

AP: పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మోటార్ వాహనాల చట్టంలో సవరణ చేస్తూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సభలో బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుకు ఆమోదం లభించడంతో ఓల్డ్ వెహికల్స్పై గ్రీన్ ట్యాక్స్ రూ.20 వేల నుంచి రూ.3వేలకు తగ్గనుంది.
News September 19, 2025
తమిళనాట పట్టు కోసం రసపట్టుగా పాలిట్రిక్స్!

వచ్చే వేసవిలో ఎన్నికలున్న తమిళనాడులో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. ఇన్నాళ్లూ పాలు నీళ్లలా ఉన్న DMK-కాంగ్రెస్ల స్నేహం చెడినట్లుంది. DMK తమను చెరుకుగడలా వాడుకుని పీల్చి పిప్పి చేసి వదిలేసిందని TN-PCC ex చీఫ్ KS అళగిరి ఆరోపించారు. DMKతో కలవాలంటే ఈసారి కాంగ్రెస్కు మంత్రి పదవులు, గతంలో కంటే ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే TVK (విజయ్)తో పొత్తుకూ వెళ్తామని సంకేతాలిచ్చారు.