News September 3, 2025

FLASH: HYD: నాంపల్లి కోర్టుకు నాగార్జున, నాగ చైతన్య

image

HYD నాంపల్లి మనోరంజన్ కోర్టుకు సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు, హీరో అక్కినేని నాగచైతన్య ఈరోజు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై న్యాయపరమైన విచారణలో భాగంగా ఇద్దరూ కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి ఎదుట తమ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లు సమాచారం. ఈ విచారణపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Similar News

News September 3, 2025

HYD: యాక్సిడెంట్‌.. కాలు తెగి నరకం అనుభవించాడు..!

image

HYD శామీర్‌పేట్(M) జీనోమ్ వ్యాలీ PS పరిధిలో విషాద ఘటన ఈరోజు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. జగన్‌గూడలోని కొల్తూరు చౌరస్తా వద్ద బైక్‌పై వస్తున్న ఇద్దరిని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఓ వ్యక్తి కాలు తెగి పడిపోయింది. నొప్పితో విలవిలలాడుతున్న వ్యక్తిని చూసిన స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.చాలా సేపు తర్వాత ‘108’ సిబ్బంది వచ్చి అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

News September 3, 2025

HYD: ఆరోగ్య శాఖ పని తీరుపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష

image

హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ పనితీరుపై ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై, ఎక్విప్‌మెంట్ పని తీరుపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ ఎక్విప్‌మెంట్‌లకు వెంటనే రిపేర్ చేయాలని, 8 ఏళ్లు దాటిన ఎక్విప్‌మెంట్‌లను స్క్రాప్‌కు తరలించాలని ఆదేశించారు.

News September 3, 2025

HYD: KCR ఫ్యామిలీ ప్రజాసొమ్ము దోచుకుంది: మహేశ్ గౌడ్

image

పదేళ్లు దోచుకున్న ప్రజాసొమ్ము పంపకం విషయంలోనే KCR ఇంట్లో గొడవలు జరిగాయని TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈరోజు గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎవరి వెంటో ఉండటానికి మాకేం ఖర్మ?, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి CM.. ప్రజలు మాతో ఉన్నారు.. మేము ప్రజలతో ఉన్నాం.. హరీశ్, సంతోష్ అవినీతిపై కవిత ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు.. పంచుకున్నదంతా పంచుకుని ఇప్పుడు బయటకొచ్చి మాట్లాడితే ఎవరు నమ్ముతారు’ అని అన్నారు.