News September 3, 2025
చింతపండుకి గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న గిరిజనులు

శ్రీకాకుళంలోని ఏజెన్సీ ప్రాంతాలలో చింతపండు సేకరించే గిరిజనులు ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజన కార్పొరేషన్ నుంచి గిట్టుబాటు ధర లభించక దళారీల దోపిడీకి గురవుతున్నారు. ఈ ఏడాది ఏజెన్సీలో మంచు ఎక్కువగా కురవటంతో చింతపండు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు గిట్టుబాటు ధర చెల్లించకపోవటంతో దళారీలకే చింతపండు తక్కువ ధరకు ఇచ్చేస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు.
Similar News
News September 5, 2025
టెక్కలి: విద్యార్థుల ప్రతిభకు ఈయన పాఠాలే మూలం

ఉపాధ్యాయుడిగా కాకుండా కళాకారుడు, చిత్రకారుడు, మైమ్ ఆర్టిస్ట్, నృత్యకారుడు, ప్రజాఉద్యమకారుడు, నాటక రచయిత తదితర రంగాల్లో డీఏ స్టాలిన్ తనదైన ముద్ర వేశారు. టెక్కలికి చెందిన ఈయన 1983-2018 వరకు టీచర్గా పని చేశారు. పిల్లలను ప్రతిభావంతులను చేసేందుకు బొమ్మాలాటలతో విద్యనందించారు. ఇందుకు 2008లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.
News September 5, 2025
‘ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు’

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సహాయక బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షలు ఈనెల 7న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లపైన జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు కలెక్టరేట్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 5,186 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు.
News September 5, 2025
నరసన్నపేట: మిస్సైన బంగారం వ్యాపారి మృతదేహం లభ్యం

నరసన్నపేటలో గతనెల 26న మిసైన బంగారం వ్యాపారి పి పార్వతీశ్వర గుప్త మృతదేహం ఎట్టకేలకు లభ్యమయింది. శుక్రవారం నరసన్నపేట పోలీసులు మిస్సింగ్ కేసును ఛేదించేందుకు చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా శ్రీకాకుళం పెద్దపాడు వద్ద రామిరెడ్డి గెడ్డలో మృతదేహం లభ్యం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. పథకం ప్రకారం హత్య చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.