News September 3, 2025

బాలల సంరక్షణ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి: జేసీ

image

నంద్యాల జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలలో కనీస సౌకర్యాలు తప్పక కల్పించాలని జేసీ విష్ణు చరణ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా విద్య, వైద్య, కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా అని ప్రతి మూడు నెలలు ఒకసారి జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ తనిఖీలు చేసి నివేదికను తమకు సమర్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలన్నారు.

Similar News

News September 7, 2025

ఈ నెల 15 నుంచి UPI లిమిట్ పెంపు.. రోజుకు ఎంతంటే?

image

ఈ నెల 15 నుంచి కొన్ని ప్రత్యేకమైన పేమెంట్స్‌(P2M)కు UPI లిమిట్‌ను రోజుకు రూ.10 లక్షలకు పెంచుతూ NPCI నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు రూ.లక్ష మాత్రమే UPI ద్వారా పంపొచ్చు. ఇన్సూరెన్స్, పన్నులు, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవాళ్లకు ఇది ఇబ్బందిగా మారడంతో ఒక్కసారి రూ.5 లక్షలు, రోజుకు రూ.10 లక్షలు పంపుకునే వెసులుబాటు కల్పించింది. కాగా మనం (P2P) స్నేహితులు, బంధువులకు పంపే లిమిట్ మాత్రం రూ.లక్షగానే ఉంది.

News September 7, 2025

వికారాబాద్: మద్యం విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా

image

వికారాబాద్ మున్సిపాలిటీలోని 10వ, 11వ వార్డులలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ గ్రామ పెద్దలు, యువజన, మహిళా సంఘాలు సమావేశం నిర్వహించాయి. గ్రామంలో మద్యం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేటి నుంచి తమ ప్రాంతంలో మద్యం అమ్మిన వారికి రూ.ఐదు లక్షల జరిమానా విధిస్తామని తీర్మానించారు. అలాగే ప్రజల సహకారంతో ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.

News September 7, 2025

కరీంనగర్‌లో మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం

image

KNR DCC కార్యాలయంలో ఆదివారం జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని బ్లాక్, మండల, పట్టణ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ బలోపేతంపై చర్చించారు. నాయకురాళ్లు తమ అభిప్రాయాలు, సూచనలను పంచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని తీర్మానం చేశారు.