News September 3, 2025
కర్నూలు: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా గోపాలచార్యులు

కర్నూలు(D)కు గర్వకారణంగా సి.బెళగల్ మండలం బురాన్ దొడ్డికి చెందిన ముతుకూరి గోపాలచార్యులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపికయ్యారు. తెలుగు పండితుడిగా జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఈయన.. విద్యార్థులతో పాటలు పాడిస్తూ, రాయిస్తూ విద్యను సృజనాత్మకంగా నేర్పుతున్నారు. ఈనెల 5న టీచర్స్ డే సందర్భంగా సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. గోరంట్లకు చెందిన వీరి కుటుంబంలో 6గురు టీచర్లుండటం విశేషం.
Similar News
News September 5, 2025
రేషన్ షాపుల్లో ఉల్లి కిలో రూ.12: కలెక్టర్

కర్నూలులోని 170 రేషన్ డిపోల్లో ఉల్లి కిలో రూ.12కు విక్రయిస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డును చూపించి కార్డుదారులు కొనుగోలు చేయవచ్చన్నారు. నగరంలోని హోటళ్ల యాజమానులు కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లిని సబ్సిడీ ధరకే కొనుగోలు చేయవచ్చన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News September 4, 2025
మంత్రాలయం ఉపాధ్యాయుడికి అవార్డు

మంత్రాలయం జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు నరసింహ రాజుకు జిల్లా స్థాయి స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఈ పాఠశాల చరిత్రలోనే ఎవరూ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు అందుకోలేదని ఆయన తెలిపారు. తోటి ఉపాధ్యాయులు అభినందించారు.
News September 4, 2025
ఈనెల 8 న జిల్లాస్థాయి హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు

ఈనెల 8న కర్నూలులోని బి.క్యాంప్ క్రీడా మైదానంలో బాల బాలికలకు హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హ్యాండ్ బాల్ సంఘం జిల్లా కార్యదర్శి పి.సువర్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2013 నుంచి 2015 మధ్యలో జన్మించిన బాల బాలికలు పోటీలకు అర్హులన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 14న డోన్లోని కోట్ల స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు.