News September 4, 2025

NZSR: 14 నుంచి 9 గేట్లకు తగ్గింపు

image

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 73,085 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. మధ్యాహ్నం వరకు 14 గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేయగా, ఇన్‌ఫ్లో తగ్గడంతో అధికారులు ఐదు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం 9 గేట్ల ద్వారా 49,113 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువ ద్వారా 1,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.

Similar News

News September 5, 2025

వేంసూరు: నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి

image

వేంసూరు మండలంలో జరిగిన గణేశ్ నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి వి.వెంకటాపురం గ్రామంలో నిమజ్జనానికి వెళ్తుండగా ట్రాక్టర్ పైనుంచి షేక్ రషీద్ (20) అనే యువకుడు కిందపడి మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్న రషీద్ స్నేహితుడికి డ్రైవింగ్ ఇచ్చి పక్కన కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలు కావడంతో చనిపోయాడు.

News September 5, 2025

అందుకే విద్యాశాఖ నా దగ్గరే పెట్టుకున్నా: రేవంత్

image

TG: తెలంగాణ ఉద్యమంలో టీచర్లదే కీలక పాత్ర అని సీఎం రేవంత్ అన్నారు. ప్రతి గ్రామానికి జై తెలంగాణ నినాదాన్ని చేరవేశారని గుర్తు చేశారు. శిల్పకళావేదికలో గురుపూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. చాలా చోట్ల కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందడం లేదని తెలిపారు. పదేళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకే విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్నానని పేర్కొన్నారు.

News September 5, 2025

GWL: చిన్నారులకు డాక్టర్ చేయూత..!

image

మల్లకల్ మండలం తాటికుంట రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లి మృతి చెందిన రాముడు, సంధ్య పిల్లలకు గద్వాల కు చెందిన డాక్టర్ హర్షవర్ధన్ మానవతా దృక్పథంతో రూ. 20 వేలు ఆర్థిక సహాయం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా చిన్నారులకు చెక్కు అందజేశారు. వారి ఆరోగ్యం ఇతర అవసరాలకు ఆదుకుంటానని హామీ ఇచ్చారు. విండో చైర్మన్ తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.