News September 4, 2025

నిజామాబాద్: 301 మందికి జీపీవో నియామక పత్రాలు

image

జిల్లా నుంచి ఎంపికైన 301 మంది గ్రామ పంచాయతీ అధికారులకు (జీపీవో) ఈ నెల 5న ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేయనున్నారు. వారిని ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నిజామాబాద్ డివిజన్ వారు పాత కలెక్టరేట్ మైదానం నుంచి, ఆర్మూర్ డివిజన్ వారు ఆర్మూర్ తహశీల్దార్ కార్యాలయం, బోధన్ డివిజన్ వారు బోధన్ తహశీల్దార్ కార్యాలయం నుంచి బయలుదేరుతారన్నారు.

Similar News

News September 5, 2025

NZB: రేపటి నుంచి మద్యం దుకాణాలు బంద్

image

గ‌ణేశ్ నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ నేప‌థ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మ‌ద్యం దుకాణాలు మూసి వేయాల‌ని కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన ఉద‌యం 6 గంట‌ల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు. నిబంధ‌న‌లు అతిక్ర‌మించి మ‌ద్యం దుకాణాల‌ను తెరిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

News September 5, 2025

NZB: మార్కెట్ యార్డుకు నాలుగు రోజులు సెలవులు

image

నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌కు గురువారం నుంచి సోమవారం వరకు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ సెకండ్ గ్రేడ్ కార్యదర్శి తెలిపారు. శుక్రవారం మిలాద్-ఉన్-నబి, శనివారం వినాయక నిమజ్జనం, ఆదివారం సెలవు, సోమవారం గ్రహణం కారణంగా వ్యాపార లావాదేవీలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తిరిగి మంగళవారం నుంచి మార్కెట్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

News September 4, 2025

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: NZB కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన ఆర్డీఓలు, తహశీల్దార్లతో వీసీ ద్వారా భూభారతిపై సమీక్ష జరిపి మాట్లాడారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.