News September 4, 2025

HYD: బైక్, కారు కడిగాడు.. రూ.10 వేలు జరిమానా

image

HYD బంజారాహిల్స్‌లో తాగునీటిని అప్రయోజనాలకు వాడిన ఇద్దరిపై హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) చర్యలు తీసుకుంది. బైక్, కారు కడిగిన వ్యక్తికి రూ.10,000, నీరు ఓవర్‌ఫ్లో అయ్యేలా వదిలిన మరొకరికి రూ.5,000 జరిమానా విధించింది. తాగునీరు వినియోగం కోసం మాత్రమేనని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు.

Similar News

News September 6, 2025

గణేశ్ మహా నిమజ్జనానికి GHMC అన్ని ఏర్పాట్లు

image

గ్రేటర్ HYDలో నేడు గణేశ్ మహా నిమజ్జనం జరుగనుంది. నిమజ్జనం సజావుగా సాగేందుకు GHMC అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీస్‌, ఇతర శాఖలతో సమన్వయం చేస్తూ కార్యక్రమం సాఫీగా జరగడానికి చర్యలు తీసుకుంది. స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూ 15వేల మంది సిబ్బందితో 24×7 పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతోంది. నగర వ్యాప్తంగా శోభాయాత్రలను మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిమజ్జనాన్ని మానిటర్ చేస్తున్నారు.

News September 6, 2025

ఖైరతాబాద్ గణపతికి శోభయాత్ర రూట్ మ్యాప్

image

ఖైరతాబాద్ మహా గణపతికి కమిటీ సభ్యుడు రాజ్‌కుమార్ కలశ పూజ చేశారు. కొద్దిసేపట్లో మహా గణపతి గంగమ్మఒడికి బయలుదేరనున్నారు. ఈ శోభాయాత్ర టెలిఫోన్‌ భవన్‌, సచివాలయం మీదుగా ట్యాంక్‌ బండ్‌ వరకు చేరుకోనుంది. బడా గణేశ్ – సైఫాబాద్ ఓల్డ్ పీఎస్- ఇక్బాల్ మినార్- తెలుగుతల్లి ఫ్లైఓవర్- అంబేడ్కర్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్‌కు చేరుకోనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో హుస్సేన్ సాగర్‌కు తరలివస్తున్నారు.

News September 6, 2025

వెస్ట్- ఈస్ట్ క్రాసింగ్ బషీర్‌బాగ్ జంక్షన్‌లో మాత్రమే అనుమతి

image

HYDలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు విస్తృత డైవర్షన్లు అమలు చేశారు. ప్రధాన రూట్లు బారికేడ్లతో మూసివేయగా, వెస్ట్- ఈస్ట్ క్రాసింగ్ బషీర్‌బాగ్ జంక్షన్‌లో మాత్రమే వాహనాలకు అనుమతించారు. కేశవగిరి, చాంద్రాయణగుట్ట, చార్మినార్, అఫ్జల్‌గంజ్, కోటి, లిబర్టీ, ట్యాంక్‌బండ్, రాణీగంజ్ వంటి ప్రాంతాల్లో కీలక మార్గమార్పులు అమలులో ఉంటాయి. పౌరులు IRR, ORR వినియోగించాలని పోలీసులు సూచించారు.