News April 3, 2024

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ SPగా నాగేశ్వరరావు

image

ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని బాధ్యతలు నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  ఈ మేరకు జిల్లాలో ఏఎస్పీగా పని చేస్తున్న నాగేశ్వరరావుకు ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండు రోజుల్లో జిల్లాకు నూతన ఎస్పీని నియమించనున్నట్లు సమాచారం. 

Similar News

News October 2, 2025

ప్రకాశం: మొదలైన దసరా దందా..!

image

దసరా సందర్భంగా పెరిగిన ప్రయాణికుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, ప్రైవేట్ ట్రావెల్స్ సాధారణ ఛార్జీలను అమాంతం పెంచేశాయి. రైళ్లలో సీట్లు నిండిపోవడం, ప్రభుత్వ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రైవేట్ ట్రావెల్స్ ఆశ్రయించాల్సివస్తుంది. సాధారణంగా ఒంగోలు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలకు HYD నుంచి రూ.700 ఉండే ధర ఇప్పుడు రూ.1000 పైనే ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.

News October 2, 2025

ఎంపీ మాగుంట ఛైర్మన్ పదవీ కాలం పొడిగింపు

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్ గృహ పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఛైర్మన్‌గా ఆయన పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈక్రమంలో ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీచేశారు.

News October 1, 2025

ప్రకాశం జిల్లాలో క్రాకర్స్ దుకాణాలపై తనిఖీలు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అక్రమ బాణసంచా నిల్వలకై పోలీసులు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో.. ఎవరైనా అనుమతులు లేకుండా బాణసంచా తయారీ, నిల్వ చేస్తున్నారనే కోణంలో పోలీసుల తనిఖీలు చేశారు. తనిఖీలపై ఎస్పీ మాట్లాడుతూ.. రానున్న దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాపుల యజమానులు తప్పక నిబంధనలు అనుసరించాలన్నారు.