News April 3, 2024

ఫోన్ ట్యాప్‌లు కాదు.. వాటర్ ట్యాప్‌‌ల మీద దృష్టి పెట్టండి: KTR

image

TG: ప్రాజెక్టుల్లో నీళ్లున్నా నిర్వహించే తెలివి ఈ ప్రభుత్వానికి లేదని KTR అన్నారు. పార్టీ గేట్లు ఎత్తడం కాదని, చేతనైతే ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని సూచించారు. ‘ఫోన్ ట్యాపులు కాదు.. వాటర్ ట్యాప్‌‌లు మీద దృష్టి పెట్టాలి. సూట్‌కేసుల్లో ఢిల్లీకి డబ్బు మోసుకెళ్లడమే రేవంత్‌కు సరిపోతోంది. మేడిగడ్డ కొట్టుకుపోయిందన్న ప్రభుత్వం గాయత్రీ, నందీ పంప్‌హౌస్‌లను ఎలా స్టార్ట్ చేసింది’ అని ప్రశ్నించారు.

Similar News

News November 3, 2025

‘చక్ దే ఇండియా2’ తీయాలని డిమాండ్.. కారణమిదే

image

18 ఏళ్ల కిందటి ‘చక్ దే ఇండియా’ గుర్తుందా? ప్లేయర్‌గా గెలవని హాకీ వరల్డ్ కప్‌ను కోచ్‌గా కబీర్ ఖాన్(షారుఖ్) సాధించడమే కథ. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని డిమాండ్లు వస్తున్నాయి. మహిళల WC సాధించడంలో కోచ్ అమోల్ మజుందార్‌‌ది కీలక పాత్ర. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 11 వేల రన్స్ చేసినా ఆయన ఇంటర్నేషనల్ డెబ్యూ చేయలేదు. కోచ్‌గా తన కల నెరవేర్చుకున్న అమోల్ కథతో చక్ దే2 తీయాలని నెటిజన్లు కోరుతున్నారు. మీరేమంటారు?

News November 3, 2025

CII సమ్మిట్‌లో రూ.2లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు: మంత్రి లోకేశ్

image

AP: ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ‘సమ్మిట్‌కు 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. 410కి పైగా ఒప్పందాలు జరగనున్నాయి. వీటి విలువ రూ.2లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ ఒప్పందాల వల్ల 9లక్షల మందికి పైగా ఉద్యోగాలు పొందుతారు. స్వదేశీ పెట్టుబడుల సాధనలో ఏపీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది’ అని ప్రెస్‌మీట్‌లో వివరించారు.

News November 3, 2025

మరో 6 నెలలు కాల్పుల విరమణ: మావోయిస్టు పార్టీ

image

TG: రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత మే నెలలో ప్రకటించిన కాల్పుల విరమణను మరో ఆరు నెలలు కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి జగన్ పేరిట ప్రకటన విడుదల చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని ఆరోపించింది.