News September 4, 2025
భారత జట్టుకు దూరం.. భువి రియాక్షన్ ఇదే!

జాతీయ జట్టుకు ఎంపికవడం తన చేతుల్లో లేదని, దానిపై సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారని భారత బౌలర్ భువనేశ్వర్ అన్నారు. ‘మైదానంలో బాగా ఆడటం, ఫిట్గా ఉండటం, బౌలింగ్ చేసేటప్పుడు లైన్&లెంగ్త్పైనే నా ఫోకస్ ఉంటుంది. కొన్నిసార్లు ఎంత బాగా ఆడినా అదృష్టం కలిసిరాదు. అవకాశం వస్తే స్టేట్, జాతీయ జట్లకు నా బెస్ట్ ఇస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భువి IND తరఫున చివరగా 2022 నవంబర్లో NZతో జరిగిన T20 మ్యాచులో ఆడారు.
Similar News
News September 6, 2025
TODAY HEADLINES

* హైదరాబాద్ వల్లే తెలంగాణ నంబర్వన్: చంద్రబాబు
* నాకూ రెండోసారి, మూడోసారి సీఎం అవ్వాలని ఉంది: CM రేవంత్
* కాళేశ్వరంపై ప్రధానిని కలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
* 6 నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం: KTR
* స్కాంల కోసం మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం: జగన్
* ఈ నెలలోనే టీచర్ నియామకాలు: లోకేశ్
* నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతి లేదు: CP
* అమెరికాకు భారత్ దూరం కావడం బాధాకరం: ట్రంప్
* భారీగా పెరిగిన బంగారం ధరలు
News September 6, 2025
రూ.217 కోట్ల నిధులు రిలీజ్

AP: విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణం, పెండింగ్ పనుల పూర్తికి కేంద్రం మంజూరు చేసిన ₹217కోట్ల నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. ఈ మేరకు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చిన నిధులను విడుదల చేసింది. ఉపాధిహామీ కింద నిర్మిస్తున్న 2,309 భవనాల పూర్తికి, PM-ABHIM కింద 696 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించింది. ఒక్కో భవనానికి ₹55లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
News September 6, 2025
వరద ప్రభావిత రాష్ట్రాల్లో PM మోదీ పర్యటన?

ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో షెడ్యూల్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఈ వర్షాకాలంలో హిమాచల్ప్రదేశ్, J&K, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, ఢిల్లీలో వరదలు బీభత్సం సృష్టించాయి. సుమారు 500మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఆయా ప్రాంతాలను ప్రధాని పరిశీలించి, నష్టంపై సమీక్షిస్తారని సమాచారం.