News September 4, 2025
శ్రీకాకుళం: 14 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో 14 బార్ల లైసెన్స్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు బుధవారం తెలిపారు. శ్రీకాకుళంలో 8, పలాస 2, ఆముదాలవలస 2, ఇచ్చాపురం 2 బార్లు కేటాయించారన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 14 లోపు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 15న లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.
Similar News
News September 6, 2025
కోణార్క్ ఎక్స్ప్రెస్లో గర్భిణికి కవలలు జననం

కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో ఇచ్ఛాపురానికి చెందిన గర్భిణి భూలక్ష్మి శుక్రవారం ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. మార్గం మధ్యలో పురిటినొప్పులు రావడంతో ఆమె భర్త జానకిరామ్ RPF సిబ్బందికి సమాచారం అందించారు. రైలును శ్రీకాకుళం స్టేషన్ వద్ద నిలిపి డాక్టర్ను పిలిపించారు. గర్భిణి రైలులో రైలులో ఆడ శిశువు, ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చిది. తల్లి, శిశువులను ఆసుపత్రికి తరలించారు.
News September 6, 2025
SKLM: రేపు అటవీశాఖ ఉద్యోగ పరీక్ష

అటవీ శాఖలో పలు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు SKLM రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదివారం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. జిల్లాలో 10 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరిక్షలకు తగ్గా ఏర్పాట్లు చేశామన్నారు.
News September 6, 2025
ఆముదాలవలస: అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య

అప్పుల బాధలు తాళలేక ఆముదాలవలసకు చెందిన చిరు వ్యాపారి బరాటం తాతయ్య (57) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు.. తాతయ్య 3 రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అతను ఇంటికి రాకపోవడంతో సోషల్ మీడియాలో ఆచూకీ కోసం ప్రకటించారు. పట్టణంలోని పెద్ద చెరువు స్మశాన వాటిక వద్ద శుక్రవారం విగత జీవిగా పడిఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.