News September 4, 2025
HYD: రూ.292 కోట్లు అప్పగించాం: శిఖా గోయల్

సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు గతేడాది రూ.292 కోట్లు రికవరీ చేసి అప్పగించామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. సోమాజిగూడలోని ఓ హోటల్లో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అప్రమత్తతతోనే సైబర్ నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. ఇప్పటివరకు 43,000 సిమ్లు, 14,000 IMEIలు, 8,000 URLలు బ్లాక్ చేశామన్నారు.
Similar News
News September 6, 2025
జగిత్యాల: ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్జెండర్లు..!

జగిత్యాల జిల్లా పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనోత్సవం బందోబస్తులో ట్రాన్స్జెండర్లతో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. HYD తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమైన ప్రజాసేవ కార్యక్రమ బాధ్యతల్లో ట్రాన్స్జెండర్లను భాగం చేసిన రెండో జిల్లాగా JGTL నిలిచిందని SP అశోక్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా 11మంది ట్రాన్స్జెండర్లను నియమించుకోవడంతో సమాజంలో ప్రతి వర్గానికి సమానత్వం, గౌరవం దక్కుతుందని ఆయన అన్నారు.
News September 6, 2025
కళ్లు అందంగా కనిపించాలంటే..

ఐ మేకప్ అనగానే కాటుక పెట్టుకోవడమే అనుకుంటారు చాలామంది. కాటుక అందాన్ని తెస్తుంది కానీ కళ్లు చిన్నగా కనిపించేలా చేస్తుంది. కళ్లు పెద్దగా కనిపించాలంటే తెలుపు, బ్రౌన్ కలర్ కాటుక ఎంచుకోవాలి. వీటిని కనుమూలల్లో సన్నగా రాస్తే కళ్లు పెద్దవిగా కనిపిస్తాయి. ఐ బ్రోస్ కూడా మరీ సన్నగా కాకుండా విల్లులా ఒంపు తిరిగినట్లుగా చేసుకుంటే కళ్లు పెద్దగా, అందంగా కనిపిస్తాయి. అలాగే లైట్ కలర్ ఐ లైనర్, మస్కారా కూడా వాడాలి.
News September 6, 2025
ఉద్యోగం చేస్తున్నారా? మీ హక్కులు తెలుసుకోండి

ప్రస్తుతకాలంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగింది. అయితే వీరిలో చాలామందికి పని ప్రదేశంలో వారి హక్కుల గురించి తెలీదు. వీరికోసం సమానపనికి సమాన వేతనం, ప్రసూతి ప్రయోజనాల హక్కు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా POSH చట్టం, సురక్షిత పని ప్రదేశం వంటివి ఉన్నాయి. పెద్ద కంపెనీల నుంచి చిన్న షాపు వరకు ఇవన్నీ వర్తిస్తాయి. మహిళల గౌరవం, స్వేచ్ఛ, సమానత్వాన్ని కాపాడటానికి ఇవి ఉపకరిస్తాయి.