News September 4, 2025

ధవన్‌కు ఈడీ నోటీసులు

image

టీమ్ ఇండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధవన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై ఆయన్ను ప్రశ్నించనుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను ఇప్పటికే ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News September 7, 2025

జస్టిస్ సుదర్శన్ రెడ్డికి MIM మద్దతు

image

వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వనున్నట్లు ఎంఐఎం ప్రెసిడెంట్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ తనను కోరినట్లు అసద్ Xలో పోస్ట్ చేశారు. ‘హైదరాబాదీ, న్యాయనిపుణుడైన సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాం. ఆయనతో మాట్లాడి బెస్ట్ విషెస్ చెప్పాను’ అని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈనెల 9న జరగనుంది.

News September 7, 2025

RRBలో 434 పోస్టులు.. గడువు పెంపు

image

RRBలో 434 పారామెడికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు. ఈ నెల 18 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని RRB తెలిపింది. నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఫార్మాసిస్ట్, టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వంటి పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం పోస్టులను బట్టి రూ.21,700 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. <>rrbsecunderabad.gov.in<<>>లో అప్లై చేసుకోవచ్చు.

News September 7, 2025

35 ఏళ్లుగా చాయ్ మాత్రమే తాగుతోంది!

image

ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాకు చెందిన పల్లి దేవి గత 35 ఏళ్లుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం టీ తాగుతూ జీవిస్తున్నారు. ఆమె తన 11 ఏళ్ల వయసు నుంచే ఆహారం, నీటికి బదులుగా టీ తాగుతూ శివుడి పూజలో నిమగ్నమైపోయారు. రోజుకు ఒకసారి బ్లాక్ టీ తాగుతున్నట్లు ఆమె కుటుంబీకులు చెబుతున్నారు. ఇన్నేళ్లుగా టీ మాత్రమే తాగి జీవించడం అసాధ్యమని, ఇప్పటికీ ఆమె ఆరోగ్యంగా ఉండటంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.