News September 4, 2025

GST తగ్గింపు.. సామాన్యులు ఖుషీ!

image

8 ఏళ్ల తర్వాత GST తగ్గడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాలు, వ్యవసాయ సామగ్రి, నోట్ బుక్స్, పెన్స్, ఏసీలు, టీవీలు, బైకులు, కార్లు.. ఇలా రోజువారీ జీవితంలో ఉపయోగపడే చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త పన్ను రేట్లు అమల్లోకి వస్తాయి. అప్పటివరకు ఆగి ఆ తర్వాత కొనేందుకు సామాన్యులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. GST తగ్గింపుపై మీ కామెంట్?

Similar News

News February 10, 2026

అప్పుల భారం AP రైతులపైనే ఎక్కువ: కేంద్ర మంత్రి

image

ఏపీ రైతులపైనే అప్పుల భారం ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ లోక్‌సభలో తెలిపారు. జులై 2018-జూన్ 2019 మధ్య APలోని ఒక్కో రైతు కుటుంబంపై సగటున రూ.2,35,554 అప్పు ఉందన్నారు. తెలంగాణ రైతుల సగటు అప్పు రూ.1,52,113గా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల సగటు అప్పు రూ.74,121గా ఉందన్నారు. అప్పుల భారం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ 5వ ప్లేస్‌లో ఉంది.

News February 10, 2026

మణిపుర్‌లో మళ్లీ హింస.. 5రోజులు ఇంటర్నెట్ బంద్

image

మణిపుర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఉఖ్రుల్ జిల్లా లిటన్ గ్రామంలో తంగ్ఖుల్ నాగా, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. సోమవారం రాత్రి మొదలైన అల్లర్లు మంగళవారానికి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 50 ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. SM ద్వారా తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే వీడియోలు షేర్ అయ్యే ప్రమాదం ఉండటంతో హోం సెక్రటరీ ఇచ్చిన ఆదేశాలతో అధికారులు జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను 5 రోజులు నిలిపేశారు.

News February 10, 2026

మేడారం హుండీ ఆదాయం ఎన్ని కోట్లంటే?

image

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేశారు. వారంలోగా వాటన్నింటినీ లెక్కించారు. అన్నింట్లో కలిపి రూ.12,64,67,051 ఆదాయం లభించింది. అలాగే హుండీల్లో 18 దేశాల కరెన్సీ కూడా ఉంది. బంగారు, వెండి అభరణాల లెక్కింపు మాత్రమే మిగిలుంది. గత జాతరలో రూ.13.25 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.12.64 కోట్లు మాత్రమే వచ్చింది.