News September 4, 2025

నెల్లూరు: రైతు బజారులో కిలో ఉల్లి రూ.16

image

నెల్లూరు జిల్లాలోని పలు రైతు బజార్లలో ఉల్లిపాయలను సబ్సీడీపై విక్రయిస్తున్నారు. పొదలకూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న రైతు బజారులో బుధవారం నుంచి కిలో రూ.16కు అందిస్తున్నట్లు నెల్లూరు మార్కెటింగ్ శాఖ ఏడీ అనితా కుమారి తెలిపారు. బయట మార్కెట్లో ఉల్లిపాయల ధర కిలో రూ.30గా ఉంది. సబ్సిడీపై రూ.16కే ఇస్తున్నామని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News September 7, 2025

కావలి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

కావలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందారు. తలమంచి- కొడవలూరు రైల్వే స్టేషన్ మధ్య మూడో లైన్‌లో వెళుతున్న రైలు నుంచి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నోవల్ టోపనో జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. మృతదేహాన్ని కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉంచామన్నారు.

News September 7, 2025

ఉదయగిరిలో గాజుల కుటుంబానికి అరుదైన గౌరవం

image

ఉదయగిరిలోని గాజుల వీధికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరి కుటుంబంలో దాదాపు 25 మంది ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశారు. ప్రతి సంవత్సరం ఈ కుటుంబంలో ఎవరికో ఒకరికి స్టేట్, జిల్లా, మండల అవార్డు వస్తుంది. గత సంవత్సరం స్టేట్ అవార్డు గాజుల షారుక్, గాజుల మున్న అందుకోగా, ఈ సంవత్సరం షాహిదా అక్తర్ జిల్లా అవార్డు, రంతుజాని మండల అవార్డు అందుకున్నారు.

News September 7, 2025

CMచేతుల మీదుగా అవార్డు అందుకున్న టీచర్ ఈశ్వరమ్మ

image

కందుకూరుకు చెందిన టీచర్ ఈశ్వరమ్మ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును CMచంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అందుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రకాశం జిల్లా PCపల్లిలో టీచర్‌గా పనిచేస్తున్నారు. సాహిత్యాభిలాషి అయిన ఆమె ‘ఈశ్వరీభూషణం’ అనే కలం పేరుతో దాదాపు 2 వేల కవితలు రాసి ప్రశంసలు పొందారు. అవార్డు అందుకున్న ఆమెను పలువురు అభినందిస్తున్నారు.