News September 4, 2025
NTR: రేపు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లాలో ఖరీఫ్-2025 సీజన్కు సంబంధించి ఎరువుల సరఫరా, ఇతర సమస్యలపై శుక్రవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశా గురువారం తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు జరుగుతుందన్నారు. రైతులు తమ సమస్యలను నేరుగా కలెక్టర్కు తెలియజేయవచ్చని చెప్పారు.
Similar News
News September 7, 2025
కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు ప్రజలకు సూచించారు. ఈనెల 8న కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని, లేదా 1100 నంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 7, 2025
ప్రశాంతంగా నిమజ్జనం.. అభినందించిన సీఎం

TG: హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. 9 రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
News September 7, 2025
ప్రశాంతంగా ముగిసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు: ఎస్పీ

ప్రశాంతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సహకరించిన గణపతి మండపాల నిర్వాహకులకు, హిందూ సంఘాలు, మిలాద్ ఉన్ నబీ కమిటీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్విరామంగా 11 రోజుల పాటు శ్రమించిన పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశామన్నారు. రాత్రింబవళ్లు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సిబ్బంది పని చేశారన్నారు.