News September 4, 2025
SLBC పనులకు సీఎం రేవంత్ డెడ్లైన్

TG: SLBC పనులు 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. కాంట్రాక్టర్ ఒక్కరోజు పనులు ఆలస్యం చేసినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. టన్నెల్ పునరుద్ధరణపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం-అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యలపై తక్షణమే సమాచారం ఇవ్వాలని సూచించారు. సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలు వాడుకోవాలని, నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలన్నారు.
Similar News
News September 18, 2025
ఈ సర్కార్ కార్మికులది.. సమస్యలు పరిష్కరిస్తా: CM రేవంత్

TG: హైదరాబాద్ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని భాషల సినిమాల షూటింగ్లు ఇక్కడ జరిగేలా సహకరించాలని సూచించారు. సమ్మె చేస్తే ఇరువర్గాలకూ నష్టం జరుగుతుందన్నారు. సినీ కార్మికుల తరఫున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని వెల్లడించారు. ఈ సర్కార్ కార్మికులదని, సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.
News September 18, 2025
ఆసియా కప్: UAE టార్గెట్ 147 రన్స్

ఆసియా కప్లో భాగంగా UAEతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 146/9 స్కోర్ చేసింది. ఫఖర్ జమాన్ హాఫ్ సెంచరీతో రాణించగా చివర్లో షహీన్ ఆఫ్రిది (29*) బౌండరీలతో స్కోర్ బోర్డును పెంచారు. UAE బౌలర్లలో జునైద్ 4, సిమ్రాన్జీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే యూఏఈ 20 ఓవర్లలో 147 రన్స్ చేయాలి. UAE గెలుస్తుందని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.
News September 18, 2025
గ్రౌండ్లోకి రాని పాక్ టీమ్.. అంపైర్లు ఏం చేశారో తెలుసా?

2006 AUG 20న ఇంగ్లండ్తో టెస్టులో <<17707677>>పాకిస్థాన్<<>> బాల్ట్యాంపరింగ్ చేసిందని అంపైర్లు గుర్తించి ఇంగ్లిష్ జట్టుకు 5రన్స్ పెనాల్టీ కింద ఇచ్చారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పాక్ ఆటగాళ్లు టీ బ్రేక్ తర్వాత మైదానంలోకి వచ్చేందుకు నిరాకరించారు. పాకిస్థాన్కు రెండుసార్లు అవకాశం ఇచ్చినా వాళ్లు గ్రౌండ్లోకి రాలేదు. దీంతో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చిన అంపైర్లు బెయిల్స్ తీసేసి ఇంగ్లండ్ను విజేతగా ప్రకటించారు.