News September 4, 2025
కామారెడ్డి: వరద నష్టంపై సీఎంకు కలెక్టర్ ప్రజెంటేషన్

ఇటీవల కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన నష్టంపై కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించారు. IDOCలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పంటలు, రోడ్లు, ఇళ్లు, ఇతర మౌలిక వసతులకు జరిగిన నష్టాలను వివరించారు. వర్షాల వల్ల కలిగిన నష్టానికి సంబంధించిన అంచనాలను ముఖ్యమంత్రికి సమగ్రంగా అందజేశారు.
Similar News
News September 7, 2025
వాలంటీర్ల పనులు మాతో ఎందుకు.. సచివాలయ ఉద్యోగుల నిరసన

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పోరాటానికి దిగారు. వాలంటీర్ల విధులను చేయాలని ప్రభుత్వం ఆదేశించడాన్ని నిరసిస్తున్నామని జేఏసీ తెలిపింది. నిన్న నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాగా వైసీపీ హయాంలో 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ఉండగా.. కూటమి సర్కార్ ఆ వ్యవస్థను పక్కనబెట్టింది. ఇప్పుడు నాలుగైదు క్లస్టర్లకు ఓ సచివాలయ ఉద్యోగికి కేటాయించి పనులు చేయాలని సూచించింది. తమపై ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నారు.
News September 7, 2025
మహిళలూ.. జింక్ తగ్గిందా..?

మహిళల ఆరోగ్యానికి జింక్ ఎంతో అవసరం. జింక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ ఉత్పత్తిని పెంచుతుంది. గర్భాశయానికి రక్తప్రసరణ పెంచి, నెలసరిలో వచ్చే నొప్పుల్ని తగ్గిస్తుంది. గాయాలు, వాపులు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. తెల్లరక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. చర్మ కణాల పునరుద్ధరణకు సాయపడుతుంది. పునరుత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుతుంది. జింక్ కోసం చిక్కుళ్లు, శనగలు, గుమ్మడి, పుచ్చగింజలు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి.
News September 7, 2025
రేపటి నుంచి నల్గొండలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్..!

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 8 నుంచి NLG పట్టణంలోని మైసయ్య విగ్రహం సమీపంలో అన్నపూర్ణ క్యాంటీన్ ఆవరణలో మెప్మా, పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. మెప్మా ద్వారా ఉపాధి పొందుతున్న మహిళల ఆధ్వర్యంలో వివిధ రకాల వంటల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.