News April 3, 2024
5 నుంచి కడప జిల్లాలో వైఎస్ షర్మిల బస్సు యాత్ర

ఈ నెల 5 నుంచి కడప జిల్లాలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆ
పార్టీ నాయకులు తెలిపారు. 5 నుంచి 12 వరకు 8 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 5, 6 తేదీలలో బద్వేలు, కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10, 11న పులివెందుల, 12న జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో బస్ యాత్ర చేపట్టనున్నారు.
Similar News
News February 2, 2026
మైదుకూరుకు చేరుకున్న బండ్ల గణేశ్ పాదయాత్ర

సినీ నిర్మాత బండ్ల గణేశ్ చేపట్టిన తిరుమల పాదయాత్ర సోమవారం మైదుకూరుకు చేరుకుంది. ఈయన హైదరాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఆయన చేపట్టిన పాదయాత్రకు మైదుకూరుకు చెందిన టీడీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికీ 350 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభమైందని గణేశ్ తెలిపారు. సీఎం చంద్రబాబు కోసం ఈ పాదయాత్ర చేపట్టానన్నారు. వచ్చే సోమవారం నాటికి తిరుమలకు చేరుకుంటానన్నారు.
News February 2, 2026
కడప: కానిస్టేబుల్పై కుక్క దాడి

కలసపాడులో కుక్కలు అధికంగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ను కుక్క కరవడంతో ఆయన గాయపడ్డారు. ప్రతి రోజు ఇలా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మరి మీ ప్రాంతంలో కుక్కల బెడద ఎలా ఉంది? కామెంట్.
News February 2, 2026
MP అవినాశ్ రెడ్డి అసంతృప్తి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను పూర్తిగా నిరాశ పరిచిందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి కీలక పథకాలకు కేటాయింపులు తగ్గించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకానికి గతేడాది రూ. 88,000 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం రూ30,000 కోట్లే కేటాయించడం దారుణమన్నారు.


