News September 5, 2025
వికారాబాద్, రంగారెడ్డి జిల్లా వాసులకు గుడ్ న్యూస్

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్నారు. చిలుకూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణకు 18-40 సంవత్సరాలు ఉండాలన్నారు. 30 రోజుల పాటు ఉచితంగా శిక్షణ అందిస్తారు. ఆసక్తిగల మహిళలు 8500165190 నంబర్లో సంప్రదించవచ్చని మహమ్మద్ అలీ ఖాన్ తెలిపారు. స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
Similar News
News September 7, 2025
HYD: పదేళ్లు కాంగ్రెస్ను అధికారంలో ఉంచేందుకు శ్రమిస్తున్నా: మహేశ్ కుమార్

పదేళ్ల తర్వాత పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని పదేళ్ల పాటు అధికారంలో ఉంచేందుకు శ్రమిస్తున్నానని MLC, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ HYDలో అన్నారు. KCRను గద్దె దించేందుకు ప్రత్యేక స్ట్రాటజీ అమలు చేశామని, CM రేవంత్ రెడ్డికి,తనకు కెమెస్ట్రీ బాగా కుదిరిందన్నారు. ఇద్దరి అభిప్రాయాలు ఏకీకృతమవుతున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా ముందుకు నడుపుతున్నామన్నారు.
News September 7, 2025
HYD: పదేళ్లు కాంగ్రెస్ను అధికారంలో ఉంచేందుకు శ్రమిస్తున్నా: మహేశ్ కుమార్

పదేళ్ల తర్వాత పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని పదేళ్ల పాటు అధికారంలో ఉంచేందుకు శ్రమిస్తున్నానని MLC, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ HYDలో అన్నారు. KCRను గద్దె దించేందుకు ప్రత్యేక స్ట్రాటజీ అమలు చేశామని, CM రేవంత్ రెడ్డికి,తనకు కెమెస్ట్రీ బాగా కుదిరిందన్నారు. ఇద్దరి అభిప్రాయాలు ఏకీకృతమవుతున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా ముందుకు నడుపుతున్నామన్నారు.
News September 7, 2025
మేడ్చల్: మరణంలోనూ వీడని బంధం

గుండెపోటుతో భర్త మృతి చెందగా, భార్య సైతం అరగంటలోనే కన్నుమూసిన విషాదకర ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. నాగారం మున్సిపాలిటీ ప్రశాంత్నగర్లో ఉంటున్న జంభాపురం నారాయణరెడ్డి(70) గుండెపోటుతో మృతి చెందగా భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఇందిర(65) అరగంటలోనే ప్రాణాలు విడిచారు. జీవితాంతం కలిసి బతికిన ఈ దంపతులు మరణంలోనూ విడిపోలేదని స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు.