News September 5, 2025

ఒక్క ఇంటి కరెంట్ బిల్లు రూ.1.61కోట్లు.. చివరికి

image

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మారుతకుళంలో మరియప్పన్ అనే వ్యక్తికి ఏకంగా రూ.1,61,31,281 కరెంట్ బిల్ వచ్చింది. ఇది చూసిన మరియప్పన్ కుటుంబం షాక్‌కి గురైంది. వెంటనే TNPDCL అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది సాంకేతిక లోపంతో పాటు మానవ తప్పిదం వల్ల జరిగిందని అధికారులు వెల్లడించారు. తప్పిదాన్ని సవరించగా వారి బిల్లు రూ.1.61కోట్ల నుంచి రూ.494కు చేరింది.

Similar News

News September 8, 2025

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి మరో షాక్!

image

స్విగ్గీ, జొమాటో <<17604591>>ఇప్పటికే<<>> డెలివరీ ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 22 నుంచి డెలివరీ ఛార్జీలపై 18శాతం జీఎస్టీ అమల్లోకి రానుంది. దీంతో ఫుడ్ ఆర్డర్ చేసేవారిపై మరింత భారం పడనుంది. జీఎస్టీ వల్ల జొమాటో కస్టమర్ల నుంచి ఆర్డరుకు రూ.2, స్విగ్గీ కొనుగోలుదార్ల నుంచి రూ.2.6 చొప్పున అదనంగా వసూలు చేసే అవకాశం ఉంది.

News September 8, 2025

గ్రహణం మళ్లీ ఎప్పుడంటే?

image

నిన్న రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం <<17644262>>కనువిందు<<>> చేసింది. అయితే రెండు వారాల తర్వాత మరో గ్రహణం ఏర్పడనుంది. ఈనెల 21న(ఆదివారం) సూర్యగ్రహణం సంభవిస్తుంది. రాత్రి 11 గంటల నుంచి 22వ తేదీ తెల్లవారుజామున 3.23 గంటల వరకు ఇది కొనసాగుతుంది. కానీ దీని ప్రభావం మన దేశంలో అంతగా ఉండదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది.

News September 8, 2025

బీసీలే టార్గెట్‌గా కవిత, మల్లన్న పార్టీలు?

image

TG: రాష్ట్రంలో BC కాన్సెప్ట్‌తో 2 కొత్త పార్టీలు ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు తీన్మార్ మల్లన్న ఈ నెల 17న పార్టీ పేరు, జెండాను ఆవిష్కరిస్తారని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలలోపు పార్టీని ప్రకటించి జెండా, ఎజెండా‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత యోచిస్తున్నట్లు సమాచారం. బీసీలను తమ వైపు తిప్పుకోవడానికి వీరిద్దరూ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.