News September 5, 2025

9న విజయనగరంలో జాబ్ మేళా

image

విజయనగరం మహిళ ప్రాంగణంలోని SEEDAP ఆధ్వర్యంలో ఈనెల 9న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా పథక సంచాలకుడు శ్రీనివాస్ పాణి గురువారం తెలిపారు. వివిధ కంపెనీల్లో 240 ఉద్యోగాలకు మేళా జరుగుతుందన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదివిన వారు అర్హులని, 18 నుంచి 28 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. యువతీ, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News September 7, 2025

పిడుగుపాటుతో 30 మేకలు మృత్యువాత

image

వేపాడ మండలం కొండగంగుబూడిలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి 30 మేకలు మృతి చెందాయి. వర్షానికి మేకలన్ని చెట్టు దగ్గరికి చేరడంతో పిడుగుపాటుకు గురయ్యాయి. నంది రమేశ్, గలారి పదసాహెబ్, సార ఎర్రయమ్మ సార బుచ్చమ్మకి చెందిన జీవాలు కొండపైన మరణించడంతో జీవనోపాధి కోల్పోయామంటూ వారు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

News September 7, 2025

కేసులు పరిష్కారమయ్యేలా కృషి: VZM SP

image

విజయనగరం జిల్లాలో ఈనెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని SP వకుల్ జిందాల్ ఆదివారం తెలిపారు. పోలీస్ స్టేషన్ స్థాయిలో రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించి, ఇందుకుగాను పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని కోరారు.

News September 7, 2025

పైడిమాంబ ఆలయంలో నేడు దర్శనాలు నిలిపివేత

image

ఉత్తరాంధ్ర భక్తుల కల్పవల్లి శ్రీ పైడిమాంబ ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తున్నామని.. తిరిగి సోమవారం ఉదయం మహా సంప్రోక్షణ కార్యక్రమం జరిపించి దర్శనాలు కల్పిస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.