News September 5, 2025
పాక్ మిలిటరీ స్టాఫ్తో ‘పహల్గామ్’ మాస్టర్మైండ్!

పహల్గామ్ టెర్రర్ అటాక్ మాస్టర్మైండ్, లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి తాజా ఫొటోలు SMలో హాట్ టాపిక్గా మారాయి. పలువురు పాక్ మిలిటరీ అధికారులతో అతడు కలిసి ఉన్న ఫొటోలు బయటికొచ్చాయి. US డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అయిన సైఫుల్లా కశ్మీర్, అఫ్గానిస్థాన్లో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. అలాంటి వ్యక్తిని మిలిటరీ అధికారులు బహిరంగంగా కలవడంతో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది.
Similar News
News September 7, 2025
జపాన్ ప్రధాని రాజీనామా

జపాన్ PM షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ఎగువ సభలో పరాజయం చెందింది. దీనికి బాధ్యత వహించాలంటూ ఆయనపై సొంత పార్టీ(లిబరల్ డెమోక్రటిక్) నేతల నుంచి ఒత్తిడి పెరిగింది. అంతర్గత విభేదాలకు స్వస్తి పలికేందుకు షిగెరు తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న సంకీర్ణ ప్రభుత్వం త్వరలోనే ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోనుంది.
News September 7, 2025
వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగు: మహేశ్ గౌడ్

TG: బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగి వచ్చేలా ఈ నెల 15న కామారెడ్డి సభ ఉండనుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. BJP నేతలు దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటారని ఫైరయ్యారు. లిక్కర్ రాణిగా కవిత నిజామాబాద్కు చెడ్డపేరు తీసుకొచ్చారని విమర్శించారు. కవిత ఎపిసోడ్ KCR ఆడించే డ్రామా అని సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగవుతుందన్నారు.
News September 7, 2025
ఈ నెల 15 నుంచి UPI లిమిట్ పెంపు.. రోజుకు ఎంతంటే?

ఈ నెల 15 నుంచి కొన్ని ప్రత్యేకమైన పేమెంట్స్(P2M)కు UPI లిమిట్ను రోజుకు రూ.10 లక్షలకు పెంచుతూ NPCI నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు రూ.లక్ష మాత్రమే UPI ద్వారా పంపొచ్చు. ఇన్సూరెన్స్, పన్నులు, స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్లకు ఇది ఇబ్బందిగా మారడంతో ఒక్కసారి రూ.5 లక్షలు, రోజుకు రూ.10 లక్షలు పంపుకునే వెసులుబాటు కల్పించింది. కాగా మనం (P2P) స్నేహితులు, బంధువులకు పంపే లిమిట్ మాత్రం రూ.లక్షగానే ఉంది.