News September 5, 2025

వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్‌కు సర్వం సిద్ధం

image

విశాఖ బీచ్ రోడ్డులోని ఎంజీఎం మైదానంలో ఈరోజు నుంచి 7వ తేదీ వరకు జరిగే వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా జరుగుతాయని, ప్రవేశం ఉచితం అని వెల్లడించారు. పర్యాటకశాఖ, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Similar News

News September 7, 2025

జూ పార్కులో వివిధ రకాల జంతు, పక్షి పిల్లల జననం

image

విశాఖ జూ పార్కులో ఏడు జంతు, పక్షి పిల్లలు జన్మించాయి. చౌసింఘా, బ్లూ గోల్డ్ మకావ్, బ్లాక్ బక్ వంటి జాతులకు సంబందించిన పిల్లలు జన్మించినట్లు క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. బ్లూ గోల్డ్ మకావ్‌ను కొన్ని వారాలుగా నియంత్రిత ఇంక్యుబేషన్ సెంటర్లో ఉంచామన్నారు. వీటిని జూ వైద్య బృందం జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారని, నూతన జంతు, పక్షి జాతులను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

News September 7, 2025

విశాఖ: కొనసాగుతున్న సహాయక చర్యలు

image

ఈస్ట్ ఇండియా పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పిడుగు పడిన విషయం తెలిసిందే. ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద పార్కింగ్ సమీపంలో ఉన్న ఇందనాల్ ట్యాంకర్‌ పై పిడుగు పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. సంస్థలో మిగతా ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మల్కాపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

News September 7, 2025

విశాఖ: కారులో మద్యం తాగి వ్యక్తి మృతి

image

కారులో మద్యం తాగుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మర్రిపాలెంలో చోటు చేసుకుంది. సుఖదేవ్ స్వైన్(53) నేవల్ డాక్ యార్డులో క్లర్క్‌గా పని చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం మర్రిపాలెంలో మద్యం దుకాణం వద్ద మందు కొని కారులో తాగాడు. సాయంత్రం వరకు కారు అక్కడే ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు పరిశీలించి మృతి చెందిన్నట్టు గుర్తించారు. మృతుడు ప్రస్తుతం విమాన్ నగర్‌లో ఉంటున్నాడు.