News September 5, 2025

అనకాపల్లి జిల్లాలో 39 మంది ఉత్తమ ఉపాధ్యాయులు: డీఈవో

image

అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 39 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైనట్లు డీఈవో అప్పారావు నాయుడు గురువారం తెలిపారు. శుక్రవారం అనకాపల్లి గుండాల జంక్షన్ వద్ద గల శంకరన్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన వీరికి సన్మానం, అవార్డుల బహుకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ముఖ్యఅతిథిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొంటున్నట్లు తెలిపారు.

Similar News

News September 7, 2025

VKB: అండర్-17 క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థులు

image

వికారాబాద్ జిల్లా ఎంకేపల్లిలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల జరిగిన అండర్-17 క్రికెట్ పోటీలలో గెలుపొందారు. ఈ జట్టుకు మహనీత ప్రవికర్ నాయకత్వం వహించారు. పీఈటీ దోమ వెంకట పర్యవేక్షణలో శిక్షణ పొందిన విద్యార్థులు చక్కగా రాణించారని ప్రిన్సిపల్ శ్రీమతి సరళ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన వారిలో నేనావత్ మహనీత్, ప్రవికర్, వి.ధనుశ్ ఉన్నారు.

News September 7, 2025

ఆదిలాబాద్: ‘బీఎస్పీతోనే బహుజనులకు రాజ్యాధికారం’

image

బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలకు 43% రిజర్వేషన్ అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీ రాజ్యాంగ రద్దు కోసం కుట్ర చేస్తోందన్నారు. నాయకులు రవీంద్ర, జంగుబాపు, రమేశ్, జగన్మోహన్, తుకారాం తదితరులు ఉన్నారు.

News September 7, 2025

సీఎం కలల ప్రాజెక్టు గురించి తెలుసా?

image

TG: సీఎం రేవంత్ కలల ప్రాజెక్టుగా ఉన్న <<17640080>>మూసీ<<>> పునరుజ్జీవన పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2024లోనే CM ప్రకటన చేశారు. తర్వాత నది తీర ప్రాజెక్టుల అధ్యయనానికి రేవంత్ బృందం UK, దక్షిణ కొరియాలో పర్యటించింది. ఆక్రమణల తొలగింపుపై వ్యతిరేకత నడుమ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ADB ₹4,100 కోట్ల రుణాన్ని ప్రకటించింది. మరోవైపు ప్రధాన భాగాలకు సంబంధించి మూడు DPRలు ఫైనల్ స్టేజీలో ఉన్నాయి.