News September 5, 2025

పర్వతగిరి: గురువుకు 111 సార్లు సన్మానం..!

image

బోధన తన వృత్తి కాకపోయినా పాఠశాల, కళాశాల విద్యార్థులకు మ్యాథ్స్ బోధిస్తారు. ఆయన విద్యా బోధనలు విన్న పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి జీవితంలో స్థిరపడ్డారు. గురు దక్షిణగా ఆయనకు సన్మానాలు చేశారు. ఆయన శిష్యులు అందరూ కలిపి 111 సార్లు సన్మానాలు చేసినట్టు పర్వతగిరికి చెందిన మూస మహమ్మద్ తెలిపారు. గురుపూజోత్సవం సందర్భంగా పలువురు విద్యార్థులు ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు.

Similar News

News September 8, 2025

BREAKING: ఈనెల 21 నుంచి దసరా సెలవులు

image

తెలంగాణలో ఈనెల 21 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హాలిడేస్ అక్టోబర్ 3 వరకు కొనసాగుతాయని అందులో పేర్కొంది. ఈ మేరకు స్కూళ్లకు విద్యాశాఖ రిమైండర్ పంపింది. అటు జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

News September 8, 2025

పరవాడ డెక్కన్ ఫార్మా కంపెనీలో ప్రమాదం.. కెమిస్ట్ మృతి

image

పరవాడ ఫార్మాసిటీ పరిధిలో గల డెక్కన్ రెడీమేడీస్ పరిశ్రమలో ఈనెల 5న విషవాయువు పీల్చి తీవ్ర అస్వస్థతకు గురైన సీనియర్ కెమిస్ట్ ఎల్.పోల్ నాయుడు గాజువాక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. యాజమాన్యం గోప్యంగా ఉంచడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలాన్ని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి పరిశీలించి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News September 8, 2025

కలికిరికి మాజీ సీఎం రాక నేడు

image

మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరికి ఇవాళ రానున్నారు. రెండు రోజులు ఇక్కడే బస చేస్తారని ఆయన పీఏ కృష్ణప్ప తెలిపారు. సోమ, మంగళవారాల్లో లోకల్‌గా జరిగే పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ వెళ్తారన్నారు.