News September 5, 2025
BRSకు సుప్రీం కేసీఆరే: హరీశ్ రావు

TG: కవిత <<17599702>>ఆరోపణలపై<<>> మాజీ మంత్రి హరీశ్ రావు పరోక్షంగా స్పందించారు. BRSకు సుప్రీం కేసీఆరే అని, ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే KCR తమకు నేర్పించారని తెలిపారు. ‘కాళేశ్వరం’ అవినీతికి హరీశ్ రావు కారణమంటూ ఆరోపణలు చేయడంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆమె పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News September 7, 2025
రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రలో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
News September 7, 2025
కవయిత్రి రమాదేవికి కాళోజీ పురస్కారం

కవయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవిని కాళోజీ పురస్కారం వరించింది. ఈ మేరకు అందెశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ ఆమెను ఎంపిక చేసింది. ఈనెల 9న కాళోజీ జయంతి రోజున ఆమెకు పురస్కారం ప్రదానం చేయనున్నారు. ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికైనందుకు రమాదేవికి సీఎం రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
News September 7, 2025
రాష్ట్రంలో కొత్త పార్టీ?

TG: రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీసీ యునైటెడ్ ఫ్రంట్(BCUF) పేరుతో MLC తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజకీయాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించడమే దీని లక్ష్యమని తెలుస్తోంది. ఈ నెల 17న విధివిధానాలు ప్రకటించి, జెండా ఆవిష్కరణ చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.