News September 5, 2025
మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం: సీఎం

AP: ప్రజలకు న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ‘న్యాయం పొందడం ప్రతి పౌరుడి హక్కు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. అందుకు ప్రత్యేకమైన మెళకువలు అవసరం’ అని తెలిపారు. ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయబోతోందని, అవసరమైన ఎకో సిస్టమ్ తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు.
Similar News
News September 8, 2025
TTD ఈవోగా మరోసారి సింఘాల్.. ఆయన గురించి తెలుసా?

AP: 2017-20 మధ్య TTD EOగా పని చేసిన IAS అధికారి అనిల్ కుమార్ <<17648825>>సింఘాల్<<>> మరోసారి అక్కడికే బదిలీ అయ్యారు. గతంలో ఆయన తిరుమలలో టైమ్ స్లాట్ దర్శన, టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీవాణి ట్రస్ట్కు రూపకల్పన చేసి అమలు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా TTD ఖజానాకు నెలకు రూ.450 కోట్ల ఆదాయం వస్తోంది. TTDలో అన్యమత ఉద్యోగుల గుర్తింపు కోసం సర్వే చేశారు. 2020లో వైసీపీ ప్రభుత్వం సింఘాల్ను ఆరోగ్యశాఖకు బదిలీ చేసింది.
News September 8, 2025
నేడే లాస్ట్.. రూ.1.26 లక్షల జీతంతో ఉద్యోగాలు

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో 841 ఉద్యోగాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 410 AAO (స్పెషలిస్ట్), 350 AAO (జనరలిస్ట్), 81 ఏఈ పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి అర్హత కలిగి ఉండాలి. వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.88,635 నుంచి రూ.1.26 లక్షల వరకు ఉంటుంది. <
News September 8, 2025
BRSకు రాజకీయంగా కనెక్టివిటీ పోయింది: ఎంపీ చామల

TG: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేమని <<17647664>>BRS<<>> చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితంతో రాజకీయంగా వీరికి కనెక్టివిటీ పోయిందని దుయ్యబట్టారు. ఏ పార్టీకి చెందని సుదర్శన్ రెడ్డికి ఓటు వేయకపోవడం దారుణమని విమర్శించారు. ఎన్నికలకు దూరంగా ఉండటం చూస్తే లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా బీఆర్ఎస్ అవసరం లేని పార్టీగా మారిపోయిందన్నారు.