News September 5, 2025
మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం: సీఎం

AP: ప్రజలకు న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ‘న్యాయం పొందడం ప్రతి పౌరుడి హక్కు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. అందుకు ప్రత్యేకమైన మెళకువలు అవసరం’ అని తెలిపారు. ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయబోతోందని, అవసరమైన ఎకో సిస్టమ్ తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు.
Similar News
News February 13, 2026
గెలిచిన మా అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం: KTR

TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తమ అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, పోలీసులతో బెదిరిస్తున్నారని BRS నేత కేటీఆర్ ఆరోపించారు. గద్వాలలోని ఓ వార్డులో 4 సార్లు రీకౌంటింగ్ చేయించి కాంగ్రెస్ అభ్యర్థిని ఒక ఓటుతో గెలిపించుకున్నారని మండిపడ్డారు. వర్ధన్నపేట, చౌటుప్పల్లోనూ ఇలాగే చేశారని చెప్పారు. 16 మున్సిపాలిటీల్లో నేరుగా గెలుస్తున్నామని, మరో 10-15 చోట్ల BRS లార్జెస్ట్ పార్టీ అని తెలిపారు.
News February 13, 2026
నీట్ ర్యాంకులతో B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు

AP: నాలుగేళ్ల B.Sc (నర్సింగ్) కోర్సులో ప్రవేశాలను నీట్-UG పరీక్ష ర్యాంకుల ఆధారంగా కల్పించాలని GOVT నిర్ణయించింది. గతంలో ఇంటర్, ఈఏపీసెట్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు జరగ్గా గత ఏడాది APNCET పెట్టారు. అయితే 16000 సీట్లకు గాను 4000 మిగిలిపోయాయి. దీంతో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ తాజా ప్రతిపాదనలు సమర్పించగా CM ఆమోదించారు. ఈ కోర్సులో ప్రవేశాలు కోరుకొనే వారు 2026-27 నుంచి నీట్-UG పరీక్ష రాయాల్సి ఉంటుంది.



