News April 3, 2024
ఈనెల 6న పీయూలో జాతీయ సదస్సు

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈనెల 6న ‘ఎమర్జింగ్ ఇండియన్ ఎకానమీ గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్స్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు కన్వీనర్ డా.జి. జిమ్మికార్టన్, కో కన్వీనర్ డా. బి. వెంకట్ రాఘవేందర్ తెలిపారు. పీయూ ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సుకు ప్రధాన వక్తగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ ప్రొ. టీఎల్ఎన్. స్వామి హాజరవుతున్నారని తెలిపారు.
Similar News
News March 27, 2026
MBNR: అంబేద్కర్ వర్సిటీ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి సంవత్సరం 2025 – 26 పరీక్షల షెడ్యూల్ విడుదల అయినట్లు మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా కె పద్మావతి పేర్కొన్నారు. పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు మేలో ఉంటాయని టైం టేబుల్ వెబ్ సైట్లో ఉందని తెలిపారు. పరీక్షకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 13వ తేదీ వరకు ఆకాశం ఉందని రీజినల్ కోఆర్డినేటర్ డా జి సత్యనారాయణ గౌడ్ వెల్లడించారు.
News March 26, 2026
MBNR: హత్యాయత్నం కేసులో ముగ్గురికి జైలుశిక్ష

భూవివాదం నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులకు గౌరవనీయ కోర్టు శిక్ష ఖరారు చేసింది. 2023 జనవరి 31న చన్నారెడ్డిపల్లి గ్రామ పరిధిలో బాధితుడు యెరుకలి చెన్నయ్యపై నిందితులు యెరుకలి వెంకటయ్య A1, శ్రీను A2, మల్లేష్ A3 కలిసి ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. పోలీసులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేసిన నవాబ్పేట్ పోలీసుల పనితీరును ఆయన కొనియాడారు.
News March 26, 2026
MBNR: పెండింగ్ కేసుల వేగవంతమైన పరిష్కారంపై దృష్టి: ఎస్పీ

మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి మహబూబ్నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లాలోని అన్ని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, మిస్సింగ్ కేసులు, ఎన్బీడబ్ల్యూ (NBW), ఎస్సీ/ఎస్టీ కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. పెండింగ్ కేసులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


