News September 5, 2025

విచిత్ర దొంగతనం.. చికెన్ సెంటర్లో 4 కత్తులు చోరీ..

image

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో విచిత్ర దొంగతనం జరిగింది. SI రాహుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సల్వాజీ వెంకటసాయి నిర్వహిస్తున్న చికెన్ సెంటర్లోకి గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి చొరబడి రూ.2వేలు విలువచేసే నాలుగు కత్తులను దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Similar News

News September 8, 2025

ఆందోల్: నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి

image

మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ఆందోల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ మేరకు పలు రోడ్లకు ఆయన శంకుస్ధాపన చేశారు. టేక్మల్ మండలంలోని తెలంగాణ మోడల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. బోధన జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ సాయిలు ఉన్నారు.

News September 8, 2025

JGTL: ‘పెట్రోల్ పంప్ ఏర్పాటుకు సహకరించండి’

image

జగిత్యాల పట్టణంలో ఓల్డ్ బస్టాండ్ సమీపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ ఏర్పాటు ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎస్పీ అశోక్ కుమార్‌ను కోరారు. ఈ విషయంపై ఆయన వినతిపత్రం అందజేశారు. పోలీస్ క్వార్టర్స్ స్థలాన్ని వాణిజ్యపరంగా వినియోగిస్తే వచ్చే ఆదాయంతో శాఖ అభివృద్ధి చేయవచ్చని జీవన్ రెడ్డి సూచించారు. ఇది ప్రజలకు కూడా ఉపయోగపడుతుందన్నారు.

News September 8, 2025

JGTL గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన సదస్సు

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో JGTL గురుకులంలో విద్యార్థినులకు రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మిషన్ శక్తి, జిల్లా మహిళా సాధికారత బృందం ఈ 10 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భవానీనగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ సదస్సు నిర్వహించింది. రుతుక్రమం సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలను నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థినులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.