News September 5, 2025

రేపు నిమజ్జనం.. మెట్రో టైమింగ్స్ పొడిగింపు

image

రేపు HYDలోని ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగించింది. తొలి ట్రైన్ రేపు ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ అర్ధరాత్రి ఒంటి గంటకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని తెలిపింది. ప్రయాణికులు, భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా వేడుకలు చేసుకోవాలని సూచించింది.

Similar News

News September 8, 2025

రూ.20 కోట్ల విలువైన వాచ్ ధరించిన పాండ్య

image

టీమ్ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన విలాసవంతమైన జీవనశైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. దుబాయ్‌లో జరగనున్న ఆసియా కప్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఆయన రూ.20 కోట్ల విలువైన లగ్జరీ వాచ్ ధరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన వాచ్‌లలో ఒకటి. రిచర్డ్ మిల్లె RM 27-04 మోడల్ వాచ్‌లు ప్రపంచంలో మొత్తం 50 మాత్రమే ఉన్నాయి. ఆసియా కప్ (₹2.6CR) ప్రైజ్ మనీ కంటే వాచ్ ధర దాదాపు పది రెట్లు ఎక్కువ.

News September 8, 2025

ఆధార్‌ను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పరిగణించాలి: సుప్రీంకోర్టు

image

ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్‌ను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పరిగణించాలని ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ ఆధార్ కార్డు జెన్యూన్‌గా ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించింది. దీనిని 12వ డాక్యుమెంట్‌గా పరిగణించాలని పేర్కొంది. బీహార్ సమగ్ర ఓటరు సర్వేపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది.

News September 8, 2025

IASల బదిలీ.. TTD ఈవోగా సింఘాల్

image

ఏపీ ప్రభుత్వం 11 మంది IAS అధికారులను <>బదిలీ<<>> చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌, GAD సెక్రటరీగా శ్యామలారావు, ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబు, ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముకేశ్ కుమార్ మీనా, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, హెల్త్ సెక్రటరీగా సౌరవ్ గౌర్‌ను నియమించింది.