News April 3, 2024
వైసీపీ పెన్షన్ డ్రామా: జనసేన
AP: పింఛన్ల పంపిణీలో వైసీపీ రాజకీయం చేస్తోందని జనసేన పార్టీ విమర్శించింది. ‘వీఆర్వోలతో భీమ్లా నాయక్ సినిమా టికెట్లు అమ్మించిన జగన్.. వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎందుకు పంపిణీ చేయట్లేదు?’ అని ట్వీట్ చేసింది. వైసీపీ పెన్షన్ డ్రామా ఆడుతోందని విమర్శలు గుప్పించింది. కాగా భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా టికెట్లు అధిక ధరకు విక్రయించకుండా ప్రభుత్వం వీఆర్వోలతో నిఘా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News October 7, 2024
అద్భుతమైన ఫొటోలు
చెన్నై మెరీనా బీచ్లో జరిగిన ఎయిర్ షోకు లక్షలాదిగా జనం తరలివచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్ షోలో ఆకాశం మీద నుంచి జెట్ విమానాలను తీసిన ఫొటోలు తాజాగా వైరలవుతున్నాయి. సముద్రం, పక్కనే చెపాక్ క్రికెట్ స్టేడియం, పొగలు కక్కుతూ దూసుకెళ్తోన్న జెట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో చెన్నై అందాలు కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఎయిర్ షోకు భారీగా జనం పోటెత్తడంతో ఐదుగురు మరణించారు.
News October 7, 2024
నాలుగు నెలల్లో స్టార్ హీరో సినిమా పూర్తి!
తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబోలో రాబోతున్న ‘SURIYA44’ షూటింగ్ పూర్తయింది. కేవలం నాలుగు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది మార్చి 28న ఈ సినిమాను అనౌన్స్ చేయగా జూన్ 2న షూటింగ్ ప్రారంభించారు. నిన్న షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది డైరెక్టర్లు కార్తీక్ను చూసి నేర్చుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
News October 7, 2024
అంతకు మించి ఏర్పాట్లు చేశాం: స్టాలిన్
చెన్నై మెరీనా బీచ్లో ఎయిర్ షో నిర్వహణకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ కోరిన ఏర్పాట్లకు మించి వసతులు కల్పించినట్టు CM స్టాలిన్ తెలిపారు. షో సందర్భంగా వేడి సంబంధిత కారణాల వల్ల ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. ఊహించిన దాని కంటే పెద్దసంఖ్యలో ప్రజలు రావడంతో తిరుగు ప్రయాణంలో వారు ఇబ్బందులుపడినట్టు తెలిసిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి భారీ ఈవెంట్లకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.