News September 5, 2025
రేపు 66 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్

గణపతి శోభాయాత్ర సంద్భంగా శనివారం నగర వ్యాప్తంగా 66 చోట్ల ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. అవసరమైతే పొడిగిస్తారు కూడా. నగర ప్రజలు సొంత వాహనాల్లో కాకుండా ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ బస్సులు, మెట్రో రైల్, ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు.
Similar News
News September 10, 2025
జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి ఫిక్స్?

జూబ్లీహిల్స్ నుంచి BRS తరఫున మాగంటి సతీమణి సునీతను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. బుధవారం తెలంగాణభవన్లో జరిగిన రహమత్నగర్ బూత్ కమిటీ మీటింగ్లో KTR పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని టాక్. ‘శ్రీమతి సునీత గారికి ప్రజల ఆశీర్వాదం ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ధీమాతోనే మాగంటి ఇంటిల్లి పాది విస్రృత పర్యటనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక అభ్యర్థిత్వంపై అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News September 10, 2025
HYD: ప్రచార బరిలోకి మాగంటి కూతుళ్లు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మాగంటి బాటలోనే ఆ ఫ్యామిలీ అంతా గెలుపు కోసం ప్రజల్లోకి వెళుతోంది. గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశిర ప్రచార బరిలోకి దిగారు. 3 రోజులుగా సుడిగాలి పర్యటన చేస్తూ సెగ్మెంట్ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. మరోవైపు బూత్ నాయకులతో మీటింగ్లు పెట్టి సమన్వయం చేసుకొంటున్నారు. కాగా, BRS టికెట్ మాగంటి సునీతకే ఇస్తారని తెలుస్తోంది.
News September 10, 2025
కర్మన్ఘాట్ గుడి పులిహోర వివాదం.. EO వివరణ

కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయంలో కుళ్లిన <<17658707>>పులిహోర ప్రసాదం<<>> పంపిణీ అయిందన్న వార్తల్లో నిజం లేదని ఆలయ EO లావణ్య స్పష్టం చేశారు. రోజూ ప్రసాదం తయారు చేసి అందజేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ చేయబోమని తెలిపారు. కొంతమంది కావాలనే ఆలయ ప్రతిష్ఠను, భక్తుల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీనిపై కమిటీ విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.